Pushpalatha : విజనగరంలో సంచలనం రేపిన సాయి సుప్రియ 13 ఏళ్ల నిర్భంధం ఇష్యూలో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాయి సుప్రియనే కాకుండా ఆమె తోడి కోడలు పుష్పలత ను కూడా మధుసూదన్ అతని కుటుంబం ఎలా వేదించారో సాయి సుప్రియ ఉదంతం తరువాత మీడియా ముందుకు వచ్చిన పుష్పలత వివరించారు. మధుసూదన్ తమ్ముడు దుర్గ ప్రసాద్ భార్య అయిన పుష్పలత ఆమెను అత్తింటి వారు పెట్టిన టార్చర్ గురించి వివరించారు.

కన్న కొడుకుతో పిన్ని అని పిలిపించారు…
మధుసూదన్ కుటుంబం చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. గోదావరి మధుసూదన్ తమ్ముడు వెంకట దుర్గ ప్రసాద్ కూడా తన భార్యను టార్చర్ చేయడంతో ఆమె అక్కడి నుండి బయటకు వచ్చి వేరుగా ఉంటోంది. ఐదేళ్లుగా భర్త ఎక్కడున్నాడో కూడా తెలిదని, సాయి సుప్రియ ఇష్యూ వల్ల మీడియాలో భర్తను చూసానని చెబుతున్న పుష్పలత అత్తింటి వేధింపుల గురించి మాట్లాడారు. మొదట బెంగుళూరులో ఉన్న వాళ్ళు విజయనగరం వచ్చేసాక ఒక బాబు పుట్టాక బాబు అలనా పాలనా అంత తాను చూసుకున్నా నన్ను అమ్మగా కాకుండా వేరే మనిషిలాగా కొడుకుకు చెప్పి పెంచారని, నా దగ్గర ఉంచకుండా దూరం చేసారని చెప్పారు.

రెండో బాబు పుట్టాక పిల్లలకు బాత్రూమ్ దగ్గర తిండి పెట్టడం నాకు కుక్కవు వేసినట్లు అన్నం ప్లేట్ లోకి వేసి బాత్రూమ్ పక్కన కూర్చో పెట్టి పెట్టడం చేసే వారని, గొడవ పడి బయటకు వస్తే తల్లిదండ్రుల పరువు పోతుందని, బిడ్డలకు తండ్రి ఉండడని భయపడి ఓర్చుకున్నా పిల్లల విషయంలో అలా ప్రవర్తించేసరికి ఉండలేక వచ్చేసానని అయితే నేను రెండో బాబును తీసుకువచ్చేసానని మొదటి బాబు అక్కడే ఉండిపోయాడని, వాడికి నేను కన్న తల్లిని అనే విషయం కూడా తెలుసో లేదో తెలియదంటూ ఎమోషనల్ అయ్యారు.































