Rajamouli: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. వేల కోట్ల కలెక్షన్స్ ను సాధించింది. అంతేకాకుండా కలెక్షన్ ల మోత మోగించింది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో విడుదల అయ్యి కోట్లలో కలెక్షన్స్ ను సాధించింది. కాగా సినిమా విడుదల అయ్యి రెండేళ్లు కావస్తోంది.
2022లో రిలీజయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మంచి హిట్ కొట్టి అనేక ఇంటర్నేషనల్ అవార్డులు అందుకొని ఏకంగా ఆస్కార్ వరకు వెళ్లి బెస్ట్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు సాధించి ఇండియన్ సినీ పరిశ్రమలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాని అనేక దేశాల్లో రిలీజ్ చేసారు. అందులో జపాన్ కూడా ఒకటి. మన ఇండియన్ సినిమాలకు అమెరికా తర్వాత జపాన్ అతిపెద్ద ఇంటర్నేషనల్ మార్కెట్. ముఖ్యంగా తెలుగు సినిమాలకు. దీంతో రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యామిలీలతో కలిసి మరీ వెళ్లి ఆర్ఆర్ఆర్ సినిమాని జపాన్ లో ప్రమోట్ చేసారు. ఇప్పటివరకు ఏ సినిమా సాధించని రికార్డు కలెక్షన్స్ జపాన్ లో ఆర్ఆర్ఆర్ సాధించింది.
అంతే కాకుండా జపాన్ ప్రజల అభిమానాన్ని గెలుచుకున్నారు. జపాన్ ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజయి రెండేళ్లు అవుతున్నా ఇంకా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి పై అభిమానం చూపిస్తున్నారు. తాజాగా జపాన్ లో ఆర్ఆర్ఆర్ సినిమాని రీ రిలీజ్ చేశారు. దీంతో రాజమౌళి మరోసారి జపాన్ కి వెళ్లారు. ఇక రాజమౌళి జపాన్ కి వెళ్లడంతో అక్కడి అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ అయ్యాయి. రాజమౌళిని చూసి అభిమానులు సంతోషిస్తున్నారు.
రాజమౌళి కోసం స్పెషల్ గిఫ్ట్
అయితే ఒక బామ్మ రాజమౌళి కోసం స్పెషల్ గిఫ్ట్ చేసుకొచ్చింది. దీంతో రాజమౌళి ఆ గిఫ్ట్ తీసుకొని ఆ బామ్మతో ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి.. జపాన్ లో ఆర్గామి క్రేన్స్ అనే గిఫ్ట్ తమకి ఇష్టమైన వాళ్ళ కోసం, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, బాగుండాలని తయారు చేస్తారు. ఒక 83 ఏళ్ళ మహిళ అలాంటివి 1000 తయారుచేసి తీసుకొచ్చి నన్ను ఆశీర్వదించింది. ఆర్ఆర్ఆర్ ఆమెకు సంతోషం ఇచ్చింది. నాకు గిఫ్ట్ పంపి బయట చలిలో ఎదురుచూస్తుంది. ఇలాంటి వాటికి ఋణం తీర్చుకోలేను అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసారు. దీంతో రాజమౌళి ట్వీట్ వైరల్ గా మారింది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…