Featured

Rajeev Kanakaala : తండ్రిని గుర్తుచేసుకొని స్టేజిమీదనే కంటతడి పెట్టిన రాజీవ్ కనకాల…

Rajeev Kanakaala : రాజీవ్ కనకాల మొదటగా బుల్లితెర మీద తన ప్రాస్తానాన్ని ప్రారంభించి వెండి తెర మీద కూడా మంచి నటుడుగా పేరు సంపాదించుకున్నాడు. దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నం.1 సినిమాతో మొదటిసారి వెండితెర మీద కెరీర్ ను ప్రారంభించాడు. తరువాత వెనక్కి తిరిగి చూసుకొనే పని లేకుండా సినిమాలలో మంచి నటుడుగా తన ప్రస్థానం సాగిపోతోంది. ఇక రాజీవ్ కనకాల భార్య సుమ కనకాల ద్వారా కూడా రాజీవ్ అందరికి సుపరిచితుడే.

ఇక సినిమాలలోనే కాకుండా రాజీవ్ అపుడప్పుడు బుల్లితెరలో జరిగే ప్రోగ్రాం లలో కూడా కనిపిస్తుంటాడు. ఈ క్రమం లోనే తాజాగా ఫాథర్స్ డే సెలెబ్రేషన్లో భాగంగా ఒక టీవీ ప్రోగ్రాంలో పాల్గొన్నాడు రాజీవ్, దీనికి సంబందించిన ప్రోమో ఒక్కటి ఇపుడు వైరల్ అవుతోంది.

తండ్రి విగ్రహాన్ని చూసి ఎమోషనల్ అయిన రాజీవ్….

తాజాగా జీ తెలుగులో ప్రసారమైన దిల్ సే ప్రోగ్రాంలో పాల్గొన్నాడు రాజీవ్. ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ ప్రోగ్రాం ప్రేక్షకులని కూడా బాగా ఆకట్టుకుంటోంది. అయితే ఇటీవల రాజీవ్ కనకాల షోకి సంబందించిన ప్రోమో ఒకటి విడుదల అయ్యింది. ఈ ప్రోమోలో రాజీవ్ కనకాల తన తండ్రిని తలుచుకొని చాలా ఎమోషనల్ అయ్యాడు.

ఈ ప్రోగ్రాంలో యాంకర్స్ సుధీర్, రష్మి రాజీవ్ ను తన తండ్రి గురించి కొన్ని మాటలు చెప్పవలసిందిగా కోరగా…. ఈ క్రమంలో రాజీవ్ తన తండ్రిని తలుచుకొని కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఈ ప్రోగ్రాంలో ఫాదర్స్ డే సందర్భంగా జీ తెలుగు వారు రాజీవ్ కనకాలకి తండ్రి విగ్రహాన్ని కానుకగా అందించారు. ఈ కానుకను చూసిన రాజీవ్ ఒక్కసారిగ స్టేజి మీదనే కన్నీళ్ళు పెట్టుకున్నాడు. మంచి కాకనుకను ఇచ్చినందుకు రాజీవ్ జీ టీవీ కి కృతజ్ఞతలు చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago