Rajeev Kanakaala : రాజీవ్ కనకాల మొదటగా బుల్లితెర మీద తన ప్రాస్తానాన్ని ప్రారంభించి వెండి తెర మీద కూడా మంచి నటుడుగా పేరు సంపాదించుకున్నాడు. దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నం.1 సినిమాతో మొదటిసారి వెండితెర మీద కెరీర్ ను ప్రారంభించాడు. తరువాత వెనక్కి తిరిగి చూసుకొనే పని లేకుండా సినిమాలలో మంచి నటుడుగా తన ప్రస్థానం సాగిపోతోంది. ఇక రాజీవ్ కనకాల భార్య సుమ కనకాల ద్వారా కూడా రాజీవ్ అందరికి సుపరిచితుడే.

ఇక సినిమాలలోనే కాకుండా రాజీవ్ అపుడప్పుడు బుల్లితెరలో జరిగే ప్రోగ్రాం లలో కూడా కనిపిస్తుంటాడు. ఈ క్రమం లోనే తాజాగా ఫాథర్స్ డే సెలెబ్రేషన్లో భాగంగా ఒక టీవీ ప్రోగ్రాంలో పాల్గొన్నాడు రాజీవ్, దీనికి సంబందించిన ప్రోమో ఒక్కటి ఇపుడు వైరల్ అవుతోంది.
తండ్రి విగ్రహాన్ని చూసి ఎమోషనల్ అయిన రాజీవ్….

తాజాగా జీ తెలుగులో ప్రసారమైన దిల్ సే ప్రోగ్రాంలో పాల్గొన్నాడు రాజీవ్. ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ ప్రోగ్రాం ప్రేక్షకులని కూడా బాగా ఆకట్టుకుంటోంది. అయితే ఇటీవల రాజీవ్ కనకాల షోకి సంబందించిన ప్రోమో ఒకటి విడుదల అయ్యింది. ఈ ప్రోమోలో రాజీవ్ కనకాల తన తండ్రిని తలుచుకొని చాలా ఎమోషనల్ అయ్యాడు.
ఈ ప్రోగ్రాంలో యాంకర్స్ సుధీర్, రష్మి రాజీవ్ ను తన తండ్రి గురించి కొన్ని మాటలు చెప్పవలసిందిగా కోరగా…. ఈ క్రమంలో రాజీవ్ తన తండ్రిని తలుచుకొని కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఈ ప్రోగ్రాంలో ఫాదర్స్ డే సందర్భంగా జీ తెలుగు వారు రాజీవ్ కనకాలకి తండ్రి విగ్రహాన్ని కానుకగా అందించారు. ఈ కానుకను చూసిన రాజీవ్ ఒక్కసారిగ స్టేజి మీదనే కన్నీళ్ళు పెట్టుకున్నాడు. మంచి కాకనుకను ఇచ్చినందుకు రాజీవ్ జీ టీవీ కి కృతజ్ఞతలు చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.





























