Featured

Rakesh master friend Aleti Atam : ఆ పనిమనిషి రాకేష్ మాస్టర్ ను చెప్పుతో కొట్టింది…: రాకేష్ మాస్టర్ సన్నిహితుడు ఏలేటి ఆటం

Rakesh master friend Aleti Atam : సినిమా ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా మొదలయి దాదాపు 1500 సినిమాలకు డాన్స్ కంపోజ్ చేసిన రాకేష్ మాస్టర్ అసలు పేరు రామారావు. ప్రస్తుతం టాప్ డాన్స్ మాస్టర్లు గా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయనకు శిష్యులు. చిరునవ్వుతో, లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, సీతయ్య వంటి సినిమాలకు కోరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ ఢీ షో ద్వారా మరింత క్రజ్ తెచ్చుకున్నాడు. ఇక జబర్దస్త్ లో అడపాదడపా కనిపించేవాడు. అయితే వైజాగ్ నుండి షూటింగ్ కోసం వెళ్లి హైదరాబాద్ తిరిగిగివచ్చిన రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో గాంధీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ జూన్ 17 నాడు కన్నుమూశారు. ఇక ఆయన గురించి ఆయన స్నేహితుడు ఏలేటి అటం మాట్లాడారు.

ఆమె రాకేష్ మాస్టర్ కొట్టింది…

రాకేష్ మాస్టర్ కి రెండేళ్ల క్రితమే ఆరోగ్యం పాడైపోయింది. ఆయనకు లివర్ పాడై పోయింది. అందుకు ముఖ్యంగా మానసిక ప్రశాంతత అలాగే మంచి ఆహరం అలవాట్లు ఉంటేనే కోలుకుంటారని చెప్పారు. కానీ రాకే్స్ మాస్టర్ కి అలాంటి పరిస్థితులు లేవు. ఆ జబ్బు వల్లే ఆయన నోటికి ఎలా పడితే అలా అందరినీ మాట్లాడటం, తిట్టడం చేసేవాడు. ఇక మందు అలవాటు మానక పోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కృష్ణ నగర్ లో ఒక రూమ్ లో ఉండే సమయంలో ఆయనకు వంట చేయడానికి అని వచ్చిన లక్ష్మి అనే మహిళ వల్ల చాలా మానసికంగా క్రుంగిపోయాడు. మొదట్లో బయటి నుండి వచ్చి వంట చేసి వెళ్ళేది. ఇక ఆయన లేచిన వెంటనే సొరకాయ జ్యూస్ లాంటివి తాగేవాడు. అందుకే కష్టమవుతుందని ఆమె ఆయన ఉన్న దగ్గరే వేరే రూమ్ లో ఉండేది. ఇద్దరి మధ్య ఎలాంటి బంధం లేదు. అందువల్ల చాలా మంది రకరకాలుగా అనుకున్నారు. అయితే ఆయన చేసిన తప్పు ఆమెకు యూట్యూబ్ ఛానెల్ పెట్టించడం. మాస్టర్ ఎంతో మందికి ఛానెల్ పెట్టించాడు. అలా ఆమెకు కొంత సహాయ పడుతుందని ఛానెల్ పెట్టించాడు. సహజీవనం అంటే మీనింగ్ తెలియయకుండానే ఆమెతో ఉన్నానని అలా చెప్పడంతో జనాల్లోకి తప్పుగా వెళ్ళింది. ఇక మాస్టర్ కి జబ్బు ఉండటం వల్ల విపరీతమైన కోపం, తిట్టడం చేసేవాడు.

ఆమెను కూడా ఒకసారి అలానే తిట్టేసరికి ఆమె చెప్పుతో కొట్టింది. ఆ సంఘటన తరువాత ఆశ్రమం దగ్గరికి వచ్చేసాడు. ఆ తరువాత మరింత క్రుంగిపోయాడు. అయితే ఆశ్రమం వచ్చాక ఆహారపు అలవాట్లు తాగుడు మన్పించడానికి ప్రయత్నించాం. కానీ ఆయన అభిమానులంటూ ఆయనను షూటింగ్స్ తీసుకెళ్లి ఏవేవో తినిపించి బాగా తాగించే సరికి ఆయన చనిపోయారు. షుగర్ ఎక్కువగా ఉంది అప్పటికే అలాంటి సమయంలో మామిడి పళ్ళు బాగా తినేసాడు, ఇక మందు మోతదుకి మించి తాగడం వల్ల లివర్ గడ్డకట్టుకుపోయింది, అలాగే ఆహారనాళం వద్ద రక్త నాళాలు చిట్లి పోయి రక్తం వాంతులు అయ్యాయి అంటూ బాధపడ్డారు.

Bhargavi

Recent Posts

ఎండలో బయటకు వెళ్తున్నారా? కళ్లను ఇలా కాపాడుకోండి!

వేసవి కాలం ప్రారంభమైనప్పటి నుంచి ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈ వేడి వాతావరణం మన ఆరోగ్యంపై మాత్రమే కాకుండా…

2 minutes ago

పూజ తర్వాత తీర్థం ఎలా తీసుకోవాలో మీకు తెలుసా? చాలా మందికి తెలియని తీర్థం నియమాలు ఇవే!

హిందూ ఆచారాల్లో పూజ అనంతరం తీర్థం స్వీకరించడం ఒక పవిత్రమైన సంప్రదాయం. ఇది కేవలం నీటిగా కాకుండా, మంత్రోచ్ఛారణతో పవిత్రత…

32 minutes ago

బీపీ 200 దాటితే ఎంత ప్రమాదమో తెలుసా? నిపుణుల హెచ్చరిక!

రక్తపోటు సమస్యను చాలా మంది సాధారణంగా తీసుకుంటుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది ఒక్కసారిగా ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా…

1 hour ago

రాత్రి తలుపు మూసి నిద్రపోతే ఏమవుతుందో తెలుసా?

రాత్రి నిద్ర నాణ్యత మన రోజువారీ ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో తెలిసిందే. అయితే చాలా మందికి ఒక సాధారణ…

2 hours ago

పసుపు అరటి కాదు… ఎర్ర అరటి తింటేనే అసలు హెల్త్ సీక్రెట్!

మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…

10 hours ago

విశాఖలో విషాదం.. యువతి ఆత్మహత్య కేసులో ఆరుగురు అరెస్ట్

విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…

11 hours ago