Featured

Rakesh master friend Aleti Atam : ఆ పనిమనిషి రాకేష్ మాస్టర్ ను చెప్పుతో కొట్టింది…: రాకేష్ మాస్టర్ సన్నిహితుడు ఏలేటి ఆటం

Rakesh master friend Aleti Atam : సినిమా ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా మొదలయి దాదాపు 1500 సినిమాలకు డాన్స్ కంపోజ్ చేసిన రాకేష్ మాస్టర్ అసలు పేరు రామారావు. ప్రస్తుతం టాప్ డాన్స్ మాస్టర్లు గా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయనకు శిష్యులు. చిరునవ్వుతో, లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, సీతయ్య వంటి సినిమాలకు కోరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ ఢీ షో ద్వారా మరింత క్రజ్ తెచ్చుకున్నాడు. ఇక జబర్దస్త్ లో అడపాదడపా కనిపించేవాడు. అయితే వైజాగ్ నుండి షూటింగ్ కోసం వెళ్లి హైదరాబాద్ తిరిగిగివచ్చిన రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో గాంధీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ జూన్ 17 నాడు కన్నుమూశారు. ఇక ఆయన గురించి ఆయన స్నేహితుడు ఏలేటి అటం మాట్లాడారు.

ఆమె రాకేష్ మాస్టర్ కొట్టింది…

రాకేష్ మాస్టర్ కి రెండేళ్ల క్రితమే ఆరోగ్యం పాడైపోయింది. ఆయనకు లివర్ పాడై పోయింది. అందుకు ముఖ్యంగా మానసిక ప్రశాంతత అలాగే మంచి ఆహరం అలవాట్లు ఉంటేనే కోలుకుంటారని చెప్పారు. కానీ రాకే్స్ మాస్టర్ కి అలాంటి పరిస్థితులు లేవు. ఆ జబ్బు వల్లే ఆయన నోటికి ఎలా పడితే అలా అందరినీ మాట్లాడటం, తిట్టడం చేసేవాడు. ఇక మందు అలవాటు మానక పోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కృష్ణ నగర్ లో ఒక రూమ్ లో ఉండే సమయంలో ఆయనకు వంట చేయడానికి అని వచ్చిన లక్ష్మి అనే మహిళ వల్ల చాలా మానసికంగా క్రుంగిపోయాడు. మొదట్లో బయటి నుండి వచ్చి వంట చేసి వెళ్ళేది. ఇక ఆయన లేచిన వెంటనే సొరకాయ జ్యూస్ లాంటివి తాగేవాడు. అందుకే కష్టమవుతుందని ఆమె ఆయన ఉన్న దగ్గరే వేరే రూమ్ లో ఉండేది. ఇద్దరి మధ్య ఎలాంటి బంధం లేదు. అందువల్ల చాలా మంది రకరకాలుగా అనుకున్నారు. అయితే ఆయన చేసిన తప్పు ఆమెకు యూట్యూబ్ ఛానెల్ పెట్టించడం. మాస్టర్ ఎంతో మందికి ఛానెల్ పెట్టించాడు. అలా ఆమెకు కొంత సహాయ పడుతుందని ఛానెల్ పెట్టించాడు. సహజీవనం అంటే మీనింగ్ తెలియయకుండానే ఆమెతో ఉన్నానని అలా చెప్పడంతో జనాల్లోకి తప్పుగా వెళ్ళింది. ఇక మాస్టర్ కి జబ్బు ఉండటం వల్ల విపరీతమైన కోపం, తిట్టడం చేసేవాడు.

ఆమెను కూడా ఒకసారి అలానే తిట్టేసరికి ఆమె చెప్పుతో కొట్టింది. ఆ సంఘటన తరువాత ఆశ్రమం దగ్గరికి వచ్చేసాడు. ఆ తరువాత మరింత క్రుంగిపోయాడు. అయితే ఆశ్రమం వచ్చాక ఆహారపు అలవాట్లు తాగుడు మన్పించడానికి ప్రయత్నించాం. కానీ ఆయన అభిమానులంటూ ఆయనను షూటింగ్స్ తీసుకెళ్లి ఏవేవో తినిపించి బాగా తాగించే సరికి ఆయన చనిపోయారు. షుగర్ ఎక్కువగా ఉంది అప్పటికే అలాంటి సమయంలో మామిడి పళ్ళు బాగా తినేసాడు, ఇక మందు మోతదుకి మించి తాగడం వల్ల లివర్ గడ్డకట్టుకుపోయింది, అలాగే ఆహారనాళం వద్ద రక్త నాళాలు చిట్లి పోయి రక్తం వాంతులు అయ్యాయి అంటూ బాధపడ్డారు.

Bhargavi

Recent Posts

వేప ఆకులకే కాదు.. వేప పండుకూ ఔషధ గుణాల ఖజానా.!

భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…

16 hours ago

సిజేరియన్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్.. అసలు కారణం ఇదేనా?

దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…

16 hours ago

జూన్ 17 తర్వాత ధనయోగం జోరు.. ఈ రాశుల జీవితంలో భారీ మార్పు!

జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…

2 days ago

రజనీకాంత్–భారతీరాజా మధ్య నిజంగా ఏమైంది? అసలు కథ ఇదే!

తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…

2 days ago

బిర్యానీలో ఈగ.. కస్టమర్‌కు కోర్టు షాక్ ఇచ్చిన తీర్పు

పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…

2 days ago

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హీట్.. రూ.99 కోట్ల ఎకరం భూమి వేలంలోకి!

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…

2 days ago