Ram Charan : సినిమా అంటే కేవలం ఒక హీరోనో దర్శకుడో కాదు, అన్నింటికీ మించి నిర్మాత ఉంటేనే ఒక సినిమా వస్తుంది. అందుకే సినిమా తీసే నిర్మాత బాగుంటేనే సినిమా పరిశ్రమ బాగుంటుంది. కానీ కరోనా వల్ల సినిమా పరిశ్రమ బాగా దెబ్బతినింది. ముఖ్యంగా పని లేకపోవడం వల్ల కార్మికులు ఎంత నష్టపోయారో, డబ్బు పెట్టిన సినిమా బిజినెస్ కాకపోవడం వల్ల నిర్మాత అంతే నష్టపోయాడు. ఇక కరోనా తరువాత అన్నా బిజినెస్ బాగా జరిగి సినిమాలు హిట్ అయి నిర్మాత లాభపడ్డాడా అంటే అది లేదు. ఓటీటీ ప్లాట్ ఫామ్ ఒక వైపు, థియేటర్లలో టికెట్ రేట్లు మరో వైపు నిర్మాతను ఇబ్బంది పెడుతున్నాయి.

హీరోలతో చర్చించడానికి రామ్ చరణ్ చొరవ…
సినిమా నిర్మాణ వ్యయం పెరగడం, అంతర్గత సమస్యలు, టికెట్ రేట్లు మొదలైన వాటి గురించి చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నా, ఇప్పుడు మాత్రం నిర్మాతల గిల్డ్ ఈ విషయాలపై చర్చించి సినిమా నిర్మాణం వ్యయాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని హీరోలు తమ రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈవిషయాన్ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ దృష్టికి నిర్మాతల గిల్డ్ తరుపున దిల్ రాజు తీసుకెళ్లారు.

దీనికి సానుకూలంగా స్పందించిన రామ్ చరణ్ హీరోలందరితో మాట్లాడి చర్చిస్తాను అని మాటిచ్చాడు. రెమ్యూనరేషన్ తగ్గించుకునే విషయంలో లో హీరోలతో చర్చిస్తానని హామీ ఇచ్చాడు. హీరోల తరుపున వారి సమస్యలను కూడా తెలుసుకుని నిర్మాత్సల గిల్డ్ కి తెలియజేయాలనీ రామ్ చరణ్ కి దిల్ రాజు చెప్పారు. నిర్మాతల సమస్యలు పరిష్కారం అయ్యేదాకా సినిమా షూటింగులు బంద్ చేయాలనే నిర్ణయం వల్ల ప్రస్తుతం సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడింది. ఇక ఈవిషయాలలో భిన్నాభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.































