Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జపాన్ లో విడుదలైనటువంటి ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ల కోసం తన భార్య ఉపాసనతో కలిసి జపాన్ వెళ్లిన విషయం మనకు తెలిసిందే. అయితే జపాన్ నుంచి ఈ దంపతులు టాంజానియా వెకేషన్ వెళ్లారు. ఇలా టాంజానియా అడవులలో ఎంజాయ్ చేసినటువంటి ఈ దంపతులు తిరిగి ఇండియా వచ్చారు.
ఇకపోతే రామ్ చరణ్ ఇంత హడావిడిగా ఇండియా తిరిగి రావడానికి ఓ కారణం ఉందని తెలుస్తోంది. గత కొంత రోజులుగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ప్రతి కదలికల గురించి గుర్తు తెలియని వ్యక్తులు తనని గమనిస్తూనే ఉన్నారని తన ఇంటి చుట్టు పరిసర ప్రాంతాలలో రెక్కీ నిర్వహిస్తూ తన ప్రతి కదలికను గమనిస్తూ ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.
అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇంటి ముందు కొందరు యువకులు పవన్ కళ్యాణ్ సిబ్బందితో తీవ్రస్థాయిలో గొడవ పెట్టుకోవడంతో పవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు.వైజాగ్ పర్యటన అనంతరం పవన్ కళ్యాణ్ పట్ల ఈ విధమైనటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఎంతోమంది అభిమాన నటుడికి, నాయకుడికి ప్రాణహాని ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇలా పవన్ కళ్యాణ్ ప్రాణాలకు ముప్పు ఉండడంతో ఆయనకు మరింత భద్రత కల్పించాలంటూ అభిమానులు డిమాండ్ చేశారు. ఇక ఈ విషయం తెలిసినటువంటి రామ్ చరణ్ వెంటనే హైదరాబాద్ చేరుకున్నారని సమాచారం.చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ ఎంతో అమితంగా ప్రేమించే రామ్ చరణ్ తన బాబాయికి ప్రాణహాని ఉందని తెలియడంతో తన బాబాయ్ కోసం మరింత సెక్యూరిటీని టైట్ చేశారని తెలుస్తోంది. తన సెక్యూరిటీని కూడా పవన్ కళ్యాణ్ కోసం రామ్ చరణ్ నియమించారట. ఇలా బాబాయ్ కోసం అబ్బాయ్ రంగంలోకి దిగడంతో మెగా అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…