Ram Gopal Varma:టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఒకానొక సమయంలో తెలుగు హిందీ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలను తీసిన దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు పొందారు. ప్రస్తుతం వర్మ ఆ స్థాయిలో సినిమాలు చేయలేదని విషయం అందరికీ తెలిసిందే.
ఇకపోతే రాంగోపాల్ వర్మ ప్రస్తుతం ఎక్కువగా బయోపిక్ చిత్రాలపై తన ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే రాజకీయ నాయకులను ఉద్దేశిస్తూ ఈయన బయోపిక్ చిత్రాలు చేయడం పెద్ద ఎత్తున వివాదాలలో నిలవడం మనం చూస్తున్నాము.ఇకపోతే ఇప్పటికే ఎన్నో రాజకీయ నాయకులకు సంబంధించిన బయోపిక్ చిత్రాలను చేయగా తాజాగా సీఎం జగన్ రామ్ గోపాల్ వర్మకు సినిమా చేసే అవకాశాన్ని కల్పించారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఈ విషయంపై సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాంగోపాల్ వర్మ సినిమా చేస్తున్నారు అంటే ఆ సినిమాపై పెద్దగా ఎవరు ఫోకస్ పెట్టరు. ఇక ఈయన ఇప్పటికే ఎన్నో రాజకీయ నాయకులకు సంబంధించిన బయోపిక్ సినిమాలను చేశారు.
ఈ క్రమంలోనే మరోసారి ఈయన సీఎం జగన్ చెప్పారని సినిమా చేస్తున్నారు అంటే కేవలం అధికార ప్రభుత్వం ప్రతిపక్ష ప్రభుత్వం మధ్య ఉన్న వ్యత్యాసాలను చూపించడం కోసమే సినిమా చేస్తున్నారు.ఒక వ్యక్తి గెలుపుకి మరొక వ్యక్తి ఓటమికి గల కారణాలు ఏంటి అనేది ఈ సినిమా ద్వారా చూపించబోతున్నట్లు భరద్వాజ్ వెల్లడించారు.అయితే ఇదివరకే ఈయన ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాలన్నీ అప్పటికి మాత్రమే కొంచెం బజ్ క్రియేట్ చేశాయి. ఆ సినిమాలను ఎవరు గుర్తు పెట్టుకోలేదు. ఈ క్రమంలోనే ఈ సినిమా కూడా అలాగే ఉంటుందని రాంగోపాల్ వర్మకు పని కావాలి ఆయనకు డబ్బు కావాలి అందుకే ఇలాంటి సినిమాలు చేస్తుంటారు అంటూ భరద్వాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…