Ramgopal Varma: ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి జరుగుతుంది. మరికొద్ది రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీ నేతలు ప్రజలలోకి వస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు. అంతేకాకుండా ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయబోతున్నారు అనే జాబితాలను కూడా విడుదల చేస్తున్నారు ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ టిడిపి పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి రాబోతున్న నేపథ్యంలో ఈయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇలా పవన్ కళ్యాణ్ తాను ఈసారి పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నానని ప్రకటించిన వెంటనే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
తాను ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అయితే అనుకోకుండా తాను పిఠాపురం నుంచి ఎన్నికల బరిలోకి దిగబోతున్నానని ఈయన చేసినటువంటి ఈ ట్వీట్ వైరల్ గా మారింది. తాను కూడా పిఠాపురం నియోజకవర్గంలో నిలబడుతున్నానంటూ ఈయన కామెంట్ చేయడంతో వర్మ ట్వీట్ వెనుక ఉన్న అర్థమేంటి అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
వర్మ సెటైరికల్ ట్వీట్…
ఈయన నిజంగానే పిఠాపురం ఎన్నికల బరిలో దిగబోతున్నారా అంటూ కొందరు సందేహాలు వ్యక్తం చేయగా మరి కొందరు పవన్ కళ్యాణ్ పై సెటైరికల్ గా ఇలాంటి ట్వీట్ చేశారు అంటూ వర్మ చేస్తున్న ట్వీట్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మరి ఎలాంటి ఉద్దేశంతో వర్మ ఈ విధమైనటువంటి పోస్ట్ చేశారనే విషయం తెలియాలి అంటే ఆయనే స్పందించాల్సి ఉంటుంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…