Ramesh Reddy : సినిమాల్లో నటుడుగా, రైటర్ గా ఇండస్ట్రీ లో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రమేష్ రెడ్డి గారు. ఎక్కువగా డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి సినిమాలకు పనిచేసిన రమేష్ రెడ్డి గారు హరీష్ శంకర్ కు బాగా సన్నిహితుడు. హరీష్ శంకర్ అసోసియేట్ డైరెక్టర్ గా ఉన్నపటినుండి ఇద్దరికీ పరిచయం ఉండటం వల్ల అప్పటి ఉండే ఇద్దరూ కలిసి పనిచేయాలని అనుకునేవారు. ఇక బాలకృష్ణ, వెంకటేష్ వంటి హీరోలతోనే కాకుండా రవితేజ, గోపీచంద్ వంటి హీరోలతో మంచి బాండ్ ఉన్న రమేష్ రెడ్డి గారు ఏవైనా మంచి కథలు దొరికితే రవి తేజ, గోపీచంద్ కి మొదట చెప్తారట. ఇక స్క్రిప్ట్ విన్నప్పుడే అది హిట్ అవుతుందో ప్లాప్ అవుతుందో రమేష్ రెడ్డి గారు చెప్పేస్తారట అందుకే అయనను రెబెల్ రమేష్ అని పిలుస్తారట. ఇక ఉన్నది ఉన్నట్లు చెప్పే రమేష్ రెడ్డి గారు దానివల్ల అవకాశాలు కూడా వదులుకున్నారు. ఇక నటనతోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ రెడ్డి గారు తొలి అనుభవాన్ని పంచుకున్నారు.

పని చేయించుకుని డబ్బు చాలా మంది ఎగ్గొట్టారు…
ఇక సినిమా ఇండస్ట్రీ లో కొంతమంది పని చేయించుకుని డబ్బు ఇచ్చేటపుడు మస్కా కొడతారు అంటూ చెప్పారు రమేష్ రెడ్డి. ఇప్పటి వరకు అలా దాదాపు 3 కోట్లు దాకా నష్టపోయుంటానని చెప్పారు. కొంతమంది యాభై వేలు ఇస్తామని చెప్పి పది వేలు చేతిలో పెట్టి చేయి దులుపుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది మంది చివరిదాకా డబ్బు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మొహం చాటేసిన వాళ్ళు ఉన్నారు. అయినా పని మానకూడదు కదా పేరు ముఖ్యం అనుకున్నాను అని రమేష్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
నంది అవార్డు మాకోస్తే వేరేవాళ్ళ ఫోటోలు వేశారు…
ఇక వెంకటేష్ గారికి ‘శీను’ ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాలకు డైలాగ్ రైటర్ గా పనిచేసారు. ఇక ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాకు గాను నంది అవార్డు రైటర్స్ కి వచ్చింది. అయితే ఆ అవార్డు గోపి, రమేష్ రెడ్డి ల ద్వయానికి వస్తే గోపి, మొహన్ ల పేర్లను పత్రికలో ఫొటోలతో సహా వేసినపుడు చాలా బాధగా అనిపించిందట. మళ్ళీ తప్పును సరిదిద్దుకుని పత్రికల వాళ్ళు రమేష్ గారి ఫోటోను ప్రచురించారట.

అలా ఇండస్ట్రీ లో పెద్దగా మార్కెటింగ్ చేసుకోకపోవడం వల్ల చాలా మందికి రైటర్ గా నేను తెలియదు. అలాగే డబ్బు డిమాండ్ చేయడం రాకపోవడం అలుసు గా తీసుకుని డబ్బు ఎగ్గొట్టడం చేయడం వల్ల చాలా నష్టపోయాను కానీ కొత్తగా మార్కెటింగ్ చేసుకోలేను, అది నా వ్యక్తిత్వం కాదు మళ్ళీ కొత్తగా మార్చుకుంటే రాదు. అయితే అలా ఎవరైనా నాకు డబ్బు ఎగ్గొట్టినపుడు మొదట్లో పెద్దగా అనిపించేది కాదు కానీ పెళ్ళై కుటుంబం ఏర్పడ్డాక అలా ఎవరైనా ఎగ్గొడితే బాధేస్తుంది అంటూ చెప్పారు.































