మరో పాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రానా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత రామానాయుడు మనవడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనదైన శైలిలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలో కూడా నటిస్తూ ఎంతో గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే రానా విరాటపర్వం అనే సినిమాలో ఓ విలక్షణమైన పాత్రలో కనిపించనున్నారు.

తాజాగా రానా నటించిన అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో అడవి, అడవి జంతువుల నేపథ్యంలో వాటి హక్కులు రక్షణ గురించి చర్చించారు. ఇక ఆయన ప్రస్తుతం విరాటపర్వం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే రానా మరో పాన్ ఇండియా చిత్రాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది.

రానా హీరోగా పాన్ ఇండియా తరహాలో విశ్వశాంతి పిక్చర్స్ నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఈ సినిమాను సీహెచ్ రాంబాబుతో కలిసి విశ్వశాంతి పిక్చర్స్ అధినేత ఆచంట గోపినాథ్ నిర్మించనున్నారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్ చిత్రంగా ఓ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా తర్వాత రానా ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొన్నట్లు సమాచారం.

గతంలో ఈ నిర్మాణ సంస్థలో బాలకృష్ణ టాప్ స్టొరీ, దేవుడు, ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన జంబలకడిపంబ అనే బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించారు. ఈ సినిమా విషయానికి వస్తే మంత్ర తంత్రాలు.. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ మూవీగా దీనిని తెరకెక్కనున్న ఈ చిత్రానికి గృహం ఫేమ్‌ డైరెక్టర్ మిలింద్ రావ్ దర్శకత్వం వహించనున్నాడని సమాచారం.ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర బృందం తెలియజేసింది.