టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ ను ఒక్కసారిగా మలుపుతిప్పిన చిత్రం “బద్రి”. ఈరోజు అనగా ఏప్రిల్ 20 నాటికి అక్షరాలా 20 సంవత్సరాలు పూర్తిచేసుకుంది బద్రి సినిమా… ఈ సందర్భంగా బద్రి సినిమా షూటింగ్ సమయంలోని తన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు ఆ సినిమా హీరోయిన్ రేణు దేశాయ్..
ఈ క్రమంలో “బద్రి” చిత్ర షూటింగ్ సమయంలో తీసిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు రేణు. అటువంటి ఫోటోలలో ఒక ఫోటో సినిమా షూటింగ్ జరుపుతున్న సమయంలో ఒక రాయిపై పవన్ కళ్యాణ్ కూర్చొని ఉంటె.. హీరోయిన్ రేణు దేశాయ్ పవన్ తో ముచ్చటిస్తున్నట్టుగా ఉంది.
ఈ ఫోటోను షేర్ చేస్తూ… “ఒక రిమోట్ లొకేషన్ లో బద్రి షూటింగ్ సమయంలో అక్కడ కూర్చోవడానికి కుర్చీలు కూడాలేవు. నేను షార్ట్స్ పై ఉండటంతో ఒకవేళ కుర్చీలు ఉన్నా కూర్చోలేని పరిస్థితి. అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్న ఒక రాయిపై కూర్చొని ఉండటంతో… ఒక అమ్మాయి ఇలా నిలబడి ఉండగా మీరు అలా కూర్చోవడం మంచి పద్దతి కాదు… అంటూ పవన్ కళ్యాణ్ గారితో జోక్ చేస్తున్న సమయంలో తీసిన ఫోటో ఇది” అంటూ షేర్ చేసారు.
మరొక ఫోటోను షేర్ చేస్తూ… “పవన్ కళ్యాణ్ గారు ఏ చికీతా.. పాట షూటింగ్ అయిపోయాక…నేను వరమంటే…సాడ్ సాంగ్ చిత్రీకరణ అయిపోయాక బాగా అలసిపోయి కూర్చున్నాం. ఆ షూటింగ్ స్పాట్ కు వెళ్లేందుకు చాలా దూరం నడిచాం. అందుకే అలిసిపోయి మా ప్రపంచాలను మరిచిపోయి ఆకలితో… అలసటతో అలా కూర్చొని ఉన్నాం.. ఆ సమయంలో తీసి ఫోటో ఇది…” అంటూ పోస్ట్ చేసారు రేణు దేశాయ్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…