ఇండియాలోనే ఈ-కామర్స్ సంస్థలలో దిగ్గజం అమెజాన్. ఒక్క క్లిక్కుతో కావాల్సిన వస్తువులను ఒక్క నిమిషం ఆలస్యం లేకుండా చేరవేసే అమెజాన్. ఈ సంస్థ ద్వారా ఆన్లైన్ లో వస్తువులను కొనుగోలు చేసుకునే వారు మనలో చాలా మండే ఉన్నారు. నిత్యం ఎన్నో వస్తువులను అమెజాన్ సంస్థ తమ కస్టమర్లకు చేరవేస్తుంది. మనకు కావలిసిన వస్తువులను అమెజాన్ లో కొనుగోలు చేసి డెలివరీ అయ్యాక చూసుకుని ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ చేసే సదుపాయాలు కల్పిస్తుంది. అయితే ఈ రిటర్న్ ఆప్టిన్ ను అవకాశంగా తీసుకుని కొందరు ఏకంగా అమెజాన్ సంస్థనే మోసం చేసారు.
జగిత్యాల పట్టణానికి చెందిన కట్ట కరుణ్ కాంత్, వేణుమాధవ్, మొహసిన్ లు అమెజాన్ లో వస్తువులను కొనుగోలు చేసేవారు. ఏకంగా 8లక్షల విలువైన వస్తువులను కొనుగోలు చేసారు వీరు ముగ్గురు. ఆన్లైన్లో వీరు కొన్న వస్తువులు డెలివరీ అయిన తరువాత ఆ వస్తువులు సరిగా లేవని వంకలు చెప్పి తిరిగి వాటిని వెనక్కి పంపే క్రమంలో అమెజాన్ నుంచి వచ్చిన వస్తువులను పక్కకు పెట్టి, ఖాళీ డబ్బాలో నకిలీ వస్తువులను ఉంచి తిరిగి పంపించేశారు. ఒక్కసారిగా ఇన్ని లక్షల వస్తువులు తిరిగి రావడంతో అనుమానం వచ్చిన అమెజాన్ ప్రతినిధులు డబ్బాలను తెరిచి చూడగా అందులో ఉన్న నకిలీ వస్తువులను చూసి, తమను మోసం చేసారని గ్రహించి అమెజాన్ లీగల్ టీమ్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారిస్తున్నారు.
తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…
సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…
సినీ తారల వ్యక్తిగత జీవితంపై ప్రేక్షకులకు ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. వారి రోజువారీ అలవాట్లు, కుటుంబ సంబంధాలు, ఇంటి…
డిజిటల్ యుగంలో ఫోక్ సాంగ్స్కు పెరుగుతున్న ఆదరణతో పాటు, కొత్త టాలెంట్కు కూడా విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ఈ ట్రెండ్లోనే…
సినీ పరిశ్రమలో ప్రతిభ ఒక్కటే సరిపోదు.. అదృష్టం కూడా తోడైతేనే కెరీర్ సాఫీగా సాగుతుంది. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు…