ఇండియాలోనే ఈ-కామర్స్ సంస్థలలో దిగ్గజం అమెజాన్. ఒక్క క్లిక్కుతో కావాల్సిన వస్తువులను ఒక్క నిమిషం ఆలస్యం లేకుండా చేరవేసే అమెజాన్. ఈ సంస్థ ద్వారా ఆన్లైన్ లో వస్తువులను కొనుగోలు చేసుకునే వారు మనలో చాలా మండే ఉన్నారు. నిత్యం ఎన్నో వస్తువులను అమెజాన్ సంస్థ తమ కస్టమర్లకు చేరవేస్తుంది. మనకు కావలిసిన వస్తువులను అమెజాన్ లో కొనుగోలు చేసి డెలివరీ అయ్యాక చూసుకుని ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ చేసే సదుపాయాలు కల్పిస్తుంది. అయితే ఈ రిటర్న్ ఆప్టిన్ ను అవకాశంగా తీసుకుని కొందరు ఏకంగా అమెజాన్ సంస్థనే మోసం చేసారు.
జగిత్యాల పట్టణానికి చెందిన కట్ట కరుణ్ కాంత్, వేణుమాధవ్, మొహసిన్ లు అమెజాన్ లో వస్తువులను కొనుగోలు చేసేవారు. ఏకంగా 8లక్షల విలువైన వస్తువులను కొనుగోలు చేసారు వీరు ముగ్గురు. ఆన్లైన్లో వీరు కొన్న వస్తువులు డెలివరీ అయిన తరువాత ఆ వస్తువులు సరిగా లేవని వంకలు చెప్పి తిరిగి వాటిని వెనక్కి పంపే క్రమంలో అమెజాన్ నుంచి వచ్చిన వస్తువులను పక్కకు పెట్టి, ఖాళీ డబ్బాలో నకిలీ వస్తువులను ఉంచి తిరిగి పంపించేశారు. ఒక్కసారిగా ఇన్ని లక్షల వస్తువులు తిరిగి రావడంతో అనుమానం వచ్చిన అమెజాన్ ప్రతినిధులు డబ్బాలను తెరిచి చూడగా అందులో ఉన్న నకిలీ వస్తువులను చూసి, తమను మోసం చేసారని గ్రహించి అమెజాన్ లీగల్ టీమ్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారిస్తున్నారు.
తమిళనాడు రాజకీయాలు మరోసారి తీవ్ర వేడిని సంతరించుకున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు రోజురోజుకూ ముదురుతున్న…
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వాటి పరస్పర దృష్టులు మనిషి జీవితంపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. గ్రహాల ప్రత్యేక కలయికల…
బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ ఊరట లభించింది. గత కొన్ని వారాలుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న పసిడి…
భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…