సీఎం కేసిఆర్ కి ప్రశ్నలు సంధించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దళితులకు సీఎం పదవి ఏమైందన్నారు రేవంత్ రెడ్డి. దళితులకు ఇస్తానన్న మూడు ఎకరాల భూమి హామీ ఏమైందని ప్రశ్నించారు. సీఎం కేసిఆర్ కొంగ జపం చేస్తున్నారని ఎద్దేవ చేశారు.

కాగా హుజూరాబాద్ ఎన్నికల కోసమే కేసిఆర్ దళిత బంధు అంటున్నారని రేవంత్ విమర్శించారు. ఇవాళ జరిగిన సభలో కేసిఆర్ ఒక్క నిజం కూడా చెప్పలేదని మండిపడ్డారు. మరియమ్మను పోలీస్ కస్టడీలో చంపేశారని.. దళితులకు కేసిఆర్ క్షమాపణలు చెప్పారని రేవంత్ డిమాండ్ చేశారు.


































