Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొదటిసారి ఆరు గ్యారెంటీ హామీల ఫైల్ పై ఆయన సంతకం చేశారు. ఇక రెండవ సంతకం దివ్యాంగ మహిళ అయినటువంటి రజనికి ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేస్తూ రేవంత్ రెడ్డి రెండవ సంతకం చేశారు.

ఇక ఈయన ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనే రజిని ఆహ్వానించి ఆమెకు ప్రభుత్వ కొలువులో నియామక పత్రాన్ని అందజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్టోబర్ 17వ తేదీ గాంధీభవన్ లో రేవంత్ రెడ్డిని కలిసినటువంటి రజిని హైదరాబాద్ నగరం నాంపల్లి దగ్గరలోని బోయిగూడకు చెందినది. ఈమె లయోలా స్కూల్, వనితా కాలేజీల్లో చదివారు. ఓపెన్ యూనివర్సిటీలో ఎంకామ్ పూర్తి చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డిని కలిసినటువంటి ఈమె తనకు ఉద్యోగం లేదు అంటూ తన బాధను మొత్తం చెప్పకున్నారు అయితే తన పరిస్థితి విన్నటువంటి రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి తన ఉద్యోగ నియామక పత్రంపై సంతకం చేస్తానని తెలియజేశారు.
టీఎస్ఎస్ఓసీఏ మేనేజర్ గా రజిని..
ఇక ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం రజనికి ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేస్తూ మొదటి ఉద్యోగ నియామక పత్రకం పై సంతకం చేశారు.ఆమెకు తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీ (టీఎస్ఎస్ఓసీఏ)లో ప్రాజెక్టు మేనేజర్గా కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగం కల్పించారు ఇక ఈమెకు నెలకు 50 వేల వరకు వేతనం రాబోతుందని నియామక పత్రాలలో పేర్కొన్నారు.
































