RGV : నిత్యం వివాదాలలో మునిగి తేలే జీవి ఆర్జీవి. ఆయనే ఒక వివాదం అవుతాడు లేదా ఆయన చుట్టూ ఏదైనా వివాదం ఉంటుంది. అందరికీ కోపం తెప్పించేలా మాట్లాడి వినోదించే ఆర్జీవి మొదటి సారిగా ఒకరిపై కోపం పెట్టుకున్నారు. ఎప్పుడు ఛిల్ల్ గా ఉండే ఆర్జీవికి కోపం వచ్చేసింది. ఆర్జీవి తెగ ఫైర్ అయిపోతున్నాడు. ఇంతకీ విషయమేంటంటే నట్టి కుమార్ చాలా రోజుల క్రితం ఆర్జీవి పై ఆరోపణలు చేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. డబ్బు విషయంలో మోసం చేసాడని అందరిని మోసం చేస్తూ సినిమాలు తీస్తున్నాడని ముంబై ఆఫీస్, హైదరాబాద్ ఆఫీస్ లను మూసేసి పారిపోయాడు అని ఆరోపించాడు.

నట్టి కుటుంబం పై కేసు….

ఇక ఆర్జీవి ఈ విషయంపై సీరియస్ అయ్యాడు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. నట్టి క్రాంతి, నట్టి కరుణ పై కంప్లయింట్ ఇచ్చాడు. తన డేంజరస్ సినిమా సమయంలో తనను చాలా డిస్టర్బ్ చేసారని, తనను 50 లక్షలు ఇస్తానని చెప్పి ఎగ్గొట్టానని అగ్రిమెంట్ పుట్టించి దొంగ సంతకాలు చేసి దొంగ డాక్యుమెంట్స్ సృష్టించారని ఆర్జీవి ఆరోపించారు. ఆ డాక్యుమెంట్స్ లో ఉన్న చిరునామా, సంతకం రెండు నావి కావని, నేను ఏ హామీ పాత్రలు ఇవ్వలేదని చెప్పారు. కోర్ట్ ని కూడా తప్పుదోవపట్టించారని ఆరోపించారు. వాళ్ళను వదిలే ప్రసక్తేలేదంటూ హెచ్చరించారు. ఇక తనపై నట్టి కుమార్ కేసు పై ప్రశ్న అడుగగా అది అదే ఇది ఇదే అంటూ స్పందించారు.
నట్టి కుమార్ ఫైర్…..

ఆర్జీవిపై కేసు వేసిన నట్టి కుమార్ ఇపుడు ఆర్జీవి కేసు వేసిన ఉదంతం పై స్పందించాడు. ఆర్జీవి పై ఫైర్ అయ్యాడు. తనతో పాటు మోసపోయిన అందరు నన్ను కలుస్తున్నారు, కేసు కోర్టులో ఉంది కాబట్టి ఇపుడు నేను స్పందించకూడదు అంటూ మాట్లాడారు. తనపై ఆరోపణలు నిజం కాకపోతే నిరూపించుకోవాలని తన హైదరాబాద్, ముంబై ఆఫీసులను ఎందుకు ఖాళీ చేసి దుకాణం ఎత్తేసి తిరుగుతున్నాడని తీవ్రంగా ఆరోపించాడు నట్టికుమార్.



























