Rishab Pant: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే.నూతన సంవత్సర వేడుకలను తన కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపడం కోసం ఉత్తరాఖండ్ వెళ్తున్న సమయంలో ఈయన కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి రిషబ్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఈయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
ఇలా ఈయనకు ప్రమాదం జరగడంతో ఎంతోమంది అభిమానులు తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించడమే కాకుండా ఈయన ఆక్సిడెంట్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రిషబ్ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే రిషబ్ ప్రమాదానికి సంబంధించిన ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసే నేటిజనులపై క్రికెటర్ రోహిత్ సతీమణి రితికా సజ్దే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఈమె స్పందిస్తూ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసే వారిని చూస్తే చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఎవరైనా బాధల్లో ఉంటే ఇలాంటివి చేయడం సరైనదా కాదా అనేది నిర్ణయించుకోలేకపోతున్నారు.
సదరు బాధితుల వ్యక్తుల ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయటం వల్ల ఆయన కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో ఆలోచించండి ఆయనకి ఓ కుటుంబం ఉంటుంది. కనీస జ్ఞానం కూడా లేకుండా ఇలా ప్రవర్తించడం చాలా సిగ్గుచేటు అంటూ రితిక ఈ సందర్భంగా రిషబ్ పంత్ ప్రమాద ఫోటోలు వీడియోలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వేసవి కాలంలో జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం వంటి ఇబ్బందులు చాలామందిని వేధిస్తాయి. వేడి కారణంగా జీర్ణక్రియ మందగించడం, తినే…
తిరుమలలో భక్తులకు ముఖ్య సమాచారం వెలువడింది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే అర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తిరుమల…
తలస్నానం తర్వాత జుట్టును తుడిచేందుకు టవల్తో బిగిగా చుట్టుకోవడం చాలా మందికి సాధారణ అలవాటు. ఇది జుట్టు త్వరగా ఆరిపోతుందనే…
చర్మ సంరక్షణలో సహజమైన మార్గాలను అనుసరించాలనే ఆసక్తి ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఇంట్లో సులభంగా దొరికే పదార్థాలతో చర్మాన్ని కాపాడుకోవచ్చని…
హిందూ పంచాంగంలో వైశాఖ మాసానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. చైత్రం తర్వాత వచ్చే ఈ నెలను శుభకార్యాలకు, పూజా…
శుక్రవారం అమావాస్య రోజు హిందూ సంప్రదాయంలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగినదిగా భావిస్తారు. ఈ రోజున మహాలక్ష్మీ దేవిని ఆరాధించడం…