General News

Rishab Pant: అతనికి ఓ ఫ్యామిలీ ఉంది… రిషబ్ ప్రమాదంపై రోహిత్ సతీమణి ఫైర్… అసలేం జరిగిందంటే?

Rishab Pant: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే.నూతన సంవత్సర వేడుకలను తన కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపడం కోసం ఉత్తరాఖండ్ వెళ్తున్న సమయంలో ఈయన కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి రిషబ్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఈయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

ఇలా ఈయనకు ప్రమాదం జరగడంతో ఎంతోమంది అభిమానులు తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించడమే కాకుండా ఈయన ఆక్సిడెంట్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రిషబ్ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే రిషబ్ ప్రమాదానికి సంబంధించిన ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసే నేటిజనులపై క్రికెటర్ రోహిత్ సతీమణి రితికా సజ్దే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఈమె స్పందిస్తూ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసే వారిని చూస్తే చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఎవరైనా బాధల్లో ఉంటే ఇలాంటివి చేయడం సరైనదా కాదా అనేది నిర్ణయించుకోలేకపోతున్నారు.

Rishab Pant: ఆ ఫోటోలు వీడియోలు కుటుంబం పై ప్రభావం చూపుతాయి..

సదరు బాధితుల వ్యక్తుల ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయటం వల్ల ఆయన కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో ఆలోచించండి ఆయనకి ఓ కుటుంబం ఉంటుంది. కనీస జ్ఞానం కూడా లేకుండా ఇలా ప్రవర్తించడం చాలా సిగ్గుచేటు అంటూ రితిక ఈ సందర్భంగా రిషబ్ పంత్ ప్రమాద ఫోటోలు వీడియోలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్.. తమిళనాడులో కొత్త చర్చకు తెర..

తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…

30 minutes ago

బంగారం కొనాలనుకునేవారికి షాక్.. ఒక్కరోజులోనే భారీ పెరుగుదల!

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…

37 minutes ago

రెండేళ్ల జ్ఞానేశ్వరి ఎక్కడ? తునిలో మిస్టరీగా మారిన చిన్నారి అదృశ్యం..

కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…

49 minutes ago

వేప ఆకులకే కాదు.. వేప పండుకూ ఔషధ గుణాల ఖజానా.!

భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…

23 hours ago

సిజేరియన్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్.. అసలు కారణం ఇదేనా?

దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…

23 hours ago

జూన్ 17 తర్వాత ధనయోగం జోరు.. ఈ రాశుల జీవితంలో భారీ మార్పు!

జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…

2 days ago