Rishabh Shetty: కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కన్నడ చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలలో నటించిన ఈయన పలు సినిమాలకు దర్శకుడిగా కూడా పనిచేశారు. ఇక తాజాగా ఈయన స్వీయ దర్శకత్వంలోనే కాంతార సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో మనకు తెలిసిందే.
దర్శకుడిగా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి రిషబ్ శెట్టి గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.. రిషబ్ శెట్టి అసలు పేరు ప్రశాంత్ శెట్టి ఈయన 1983 జులై 7న కర్ణాటకలోని కుందాపూర్ లో జన్మించారు. ఈయన హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తి ఈయనకు మరో సోదరుడు కూడా ఉన్నారు. ఫిలిం డైరెక్షన్లో డిప్లమో చేసినటువంటి రిషబ్ శెట్టి కెరియర్ మొదట్లో ఏఎంఆర్ రమేష్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.
అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నటువంటి రిషబ్ శెట్టి 2010 సంవత్సరంలో నటుడిగా మారాడు ‘నామ్ ఓరీలి ఒండినా’ చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించారు.ఇలా చిన్న చిన్న పాత్రలలో నటించినటువంటి ఈయన దర్శకత్వంపై ఇష్టం ఉండటంతో మొదటి సినిమా ‘రిక్కీ’ 2016 లో రిలీజ్ అయింది. ఈ సినిమా తర్వాత రక్షిత్ శెట్టి హీరోగా కీరిక్ పార్టీ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించారు.
ఇలా ఈ సినిమాతో సక్సెస్ కావడంతో ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు దర్శకత్వం చేస్తూ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇక తాజాగా తాప్సి నటించిన మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో కూడా ఈయన కీలక పాత్రలో నటించారు. ఇక రిషబ్ శెట్టి2017లో ప్రగతి శెట్టి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో దర్శకుడిగా నిర్మాతగా ఎంతో బిజీగా ఉన్నారు.
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన సుస్వాగతం సినిమా వెనుక ఆసక్తికరమైన విషయం తాజాగా మళ్లీ చర్చకు వచ్చింది. ఈ చిత్రంలో హీరోగా…
ప్రస్తుతం మార్కెట్లో కల్తీ ఆహారంపై పెరుగుతున్న ఆందోళన మధ్య, పాలు కూడా భద్రత పరంగా చర్చకు వస్తున్నాయి. పిల్లల నుంచి…
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, ఆ జట్టు సహ యజమాని ప్రీతి జింటా స్టేడియంలో కనిపించకపోవడం అభిమానుల్లో…
ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహుకేతు దోష నివారణ పూజల విషయంలో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరలో…
అక్షయ తృతీయ సందర్భంగా ప్రారంభమయ్యే చార్ ధామ్ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సాగుతున్నాయి. ఈ ఏడాది యాత్రను…
ఎండాకాలం వచ్చిందంటే మార్కెట్లలో కనిపించే ప్రత్యేక పండ్లలో ‘పాల పండ్లు’కి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అడవుల్లో సహజంగా పెరిగే…