Rishabh Shetty: కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కన్నడ చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలలో నటించిన ఈయన పలు సినిమాలకు దర్శకుడిగా కూడా పనిచేశారు. ఇక తాజాగా ఈయన స్వీయ దర్శకత్వంలోనే కాంతార సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో మనకు తెలిసిందే.
దర్శకుడిగా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి రిషబ్ శెట్టి గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.. రిషబ్ శెట్టి అసలు పేరు ప్రశాంత్ శెట్టి ఈయన 1983 జులై 7న కర్ణాటకలోని కుందాపూర్ లో జన్మించారు. ఈయన హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తి ఈయనకు మరో సోదరుడు కూడా ఉన్నారు. ఫిలిం డైరెక్షన్లో డిప్లమో చేసినటువంటి రిషబ్ శెట్టి కెరియర్ మొదట్లో ఏఎంఆర్ రమేష్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.
అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నటువంటి రిషబ్ శెట్టి 2010 సంవత్సరంలో నటుడిగా మారాడు ‘నామ్ ఓరీలి ఒండినా’ చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించారు.ఇలా చిన్న చిన్న పాత్రలలో నటించినటువంటి ఈయన దర్శకత్వంపై ఇష్టం ఉండటంతో మొదటి సినిమా ‘రిక్కీ’ 2016 లో రిలీజ్ అయింది. ఈ సినిమా తర్వాత రక్షిత్ శెట్టి హీరోగా కీరిక్ పార్టీ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించారు.
ఇలా ఈ సినిమాతో సక్సెస్ కావడంతో ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు దర్శకత్వం చేస్తూ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇక తాజాగా తాప్సి నటించిన మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో కూడా ఈయన కీలక పాత్రలో నటించారు. ఇక రిషబ్ శెట్టి2017లో ప్రగతి శెట్టి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో దర్శకుడిగా నిర్మాతగా ఎంతో బిజీగా ఉన్నారు.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…