RK Roja: వైకాపా మాజీ మహిళా మంత్రి ఆర్కే రోజా గతంలో ఫైర్ బ్రాండ్ గా రాజకీయాలలో కొనసాగుతూ ప్రతిపక్ష నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించేవారు. ఇకపోతే తాజాగా ఈమె మాజీ అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా తరచూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా అలాగే మీడియా సమావేశాలలో రోజా చేస్తున్న వ్యాఖ్యలు సంచలనగా మారాయి.
నిత్యం కూటమి ప్రభుత్వాన్ని ఎన్నికల ముందు ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తూనే ఉన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దాడులు గురించి మహిళలపై అత్యాచారం ఘటనల గురించి రోజా ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇకపోతే తాజాగా ఈమె ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన పది సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచారు.
ఇక ఈ ఎన్నికలలో కూడా ఈయన తెలుగుదేశం పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగారు. ఇలా కూటమి అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్నారు. ఇదే విషయం గురించి రోజూ మాట్లాడుతూ బీజేపీతోనూ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని గెలవడం కాదు నీకు దమ్ముంటే సింగిల్ గా పోటీ చేసి గెలిచి చూపించు అంటూ సవాల్ విసిరారు.
ఇలా ఎవరెవరి బలంతోనో నువ్వు వచ్చావే తప్ప నీ బలంతో నువ్వు విజయం సాధించలేదని రోజా తెలిపారు. నీ బలం ఏంటి అనేది గతం ఎన్నికలలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినప్పుడే స్పష్టమైందని రోజా విమర్శలు చేశారు. ఇక నేను సొంతంగా ఓ నియోజకవర్గంలో పోటీ చేసే గెలిచాను ఈరోజు నేను ఓడిపోవచ్చు కానీ రేపు ధైర్యంగా నిలబడి గెలవగలను అనే నమ్మకం నాకుందని, అదే నువ్వు ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచి చూపించగలవా అంటూ రోజా సవాల్ విసిరారు. ప్రస్తుతం రోజా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…
హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…