సీనీనటిగా, ఎంఎల్ఏ గా రోజా అందరికీ సుపరిచితమే. రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనీనటిగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఆ తరువాత రాజకీయాలలోకి అడుగు పెట్టింది. తాజాగా రోజా భర్త సెల్వమణి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని రోజా రాజకీయ జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

చంద్రబాబునాయుడు కోరిక మేరకు తెలుగుదేశం పార్టీ లోకి వెళ్లి మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసింది. అయితే రాజకీయాల్లో ఆమెకు తీవ్ర నిరాశ ఎదురైంది. అలా రాజకీయాల్లోకి ఎంటరైన రోజా చుట్టూ కుల రాజకీయాలు జరిగాయని ఆ పార్టీ వాళ్ళు మోసం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినా అతను ఏమి చేయకపోవడంతో ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లు తెలిపారు.
టిడిపి పార్టీలో ఉన్నప్పుడు రోజాను ఎంతో హింసించారని రాజకీయాలలో తనని ఎదగనివ్వకుండా చేశారని సెల్వమణి వెల్లడించారు. టిడిపి పార్టీలో ఉన్నప్పుడు పార్టీలో గెలవడం కోసం సుమారు నాలుగైదు ఇల్లులను కూడా అమ్మకున్నామని ఆ పార్టీ వల్ల ఎంతో ఆస్తి నష్టాన్ని కూడా భరించామని ఈ సందర్భంగా సెల్వమణి తెలియజేశారు.
ఇలా తెలుగుదేశం పార్టీలో ఎన్నో హింసలకు గురి చేసిన తర్వాత ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్ళినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కేవలం 10 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. తనని కలవడానికి వెళ్లినప్పుడు రాజశేఖరరెడ్డిగారు సాదరంగా ఆహ్వానించి మంచిగా మాట్లాడటం చూసి నాకు పదవి అవసరం లేదు కేవలం పార్టీలో ఉంటానని రోజా చెప్పినట్టు సెల్వమని చెప్పారు. అప్పటినుంచి రోజా రాజశేఖర్ రెడ్డి పార్టీలో ఉండటమే కాకుండా తన మరణానంతరం జగన్ వెంట నడిచారు అని ఈ సందర్భంగా సెల్వమణి తెలియజేశారు. ఏ పార్టీలో మీకు శత్రువులు ఎక్కువగా ఉన్నారనే ప్రశ్న ఎదురుగా ప్రతి పార్టీలోనూ శత్రువులు ఉంటారని. ఈ సందర్భంగా సెల్వమణి తెలియజేశారు.





























