Rocking Rakesh: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రాకింగ్ రాకేష్ కిరాక్ ఆర్పీ వంటి వాళ్ళు ఒకరు అయితే మల్లెమాల వారితో మనస్పర్ధలు కారణంగా ఆర్పీ ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చి జబర్దస్త్ కార్యక్రమం అలాగే మల్లెమాల వారి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న అనంతరం ఈయన బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు.
ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి ఆర్పీ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే హైదరాబాదులో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే కర్రి పాయింట్ నిర్వహిస్తూ అతి తక్కువ సమయంలోనే బిజినెస్ లో ఎంతో సక్సెస్ అయ్యారు. అయితే గత కొంతకాలంగా ఈయన రెస్టారెంట్ గురించి నెగిటివ్ రివ్యూలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఇలా తన రెస్టారెంట్లో ఫుడ్ ఏమాత్రం టేస్ట్ గా లేదంటూ నెగిటివ్ రివ్యూ రావడంతో ఈ వార్తలపై స్పందించిన ఆర్పీ కొందరు ఉద్దేశపూర్వకంగానే తన చేపలు పులుసు పై కుట్ర చేస్తున్నారని ఇదంతా పెయిడ్ బ్యాచ్ పనే అంటూ ఈయన ఈ వార్తలపై స్పందించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా నీతిగా నిజాయితీగా చేస్తున్న తన బిజినెస్ ను దెబ్బతీయలేరని తెలిపారు.
ఇదిలా ఉండగా తాజాగా మరొక జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈయనకు ఆర్పీ రెస్టారెంట్ గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ ఆర్పీ చేపల పులుసు జబర్దస్త్ పెట్టిన బిక్ష అంటూ కామెంట్లు చేశారు. మరి ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా మీరు ఆర్పీను కలిసారా అని అడగడంతో అంత పెద్ద వాళ్లను కలిసే అదృష్టం తనకు ఇంకా రాలేదని మేము ఏదో చిన్న చిన్న ఆర్టిస్టులం వాళ్లు పెద్దవాళ్లు అంటూ పరోక్షంగా ఆర్పీ పై విమర్శలు చేశారు. దీంతో రాకేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…