రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ చిత్రంగా అత్యంత భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. గత రెండేళ్లుగా ఎన్నో కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ పిరియాడిక్ మల్టీస్టారర్ ఎట్టకేలకు మార్చి 25 న విడుదలకు సిద్దమైంది. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్. టీం అందరూ ప్రమోషన్స్ లో యమ బిజీగా గడిపోస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి దేశమంతా తిరిగేస్తూ సినిమాపై మరింత అంచనాలు పెంచేస్తున్నారు.
ఇంత భారీ అంచనాల నడుమ మరో రెండు రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమా ఎటువంటి ప్రభంజనాలు సృష్టిస్తుందో అనే విషయం సర్వత్రా ఆశక్తిగా మారింది. ఈ నేపధ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమాపై మూడురోజుల ముందుగానే సినీ విమర్శకుడు, ఓవర్ సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధూ రివ్యూ ఇచ్చారు. అంతేకాదు సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఖాయం అంటూ ఫైవ్ స్టార్ రేటింగ్ కూడా ఇచ్చాడు.
‘అందరూ గర్వపడేలా ఈ సినిమా ఉందని, ఇండియన్ సినిమా గొప్ప కలలు కనడమే కాదు, వాటిని సాకారం చేసుకోవచ్చని నిరూపించింది ఆర్ఆర్ఆర్ చిత్రం. ఈ చిత్రాన్ని అందరూ మిస్ అవ్వకుండా చూసి తీరాల్సిందే! ఇప్పుడు ఈ సినిమా బ్లాక్బస్టర్ అని చెప్పుకున్నా రేపటి తరానికి ఈ సినిమా ఒక క్లాసిక్గా మిగిలిపోతుంది అంటూ తన ట్విటర్లో రాసుకొచ్చాడు.
ఇక పెర్ఫామెన్స్ విషయానికి వస్తే.. సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ అద్భుతంగా ఉందని, వీరిద్దరి నటన కూడా అడిరిందని, మరో కీలక పాత్రలో నటించిన అజయ్ దేవ్గణ్ కూడా ఒక సర్ప్రైజ్ ప్యాకేజీలా కనిపిస్తాడు. ఇక హీరోయిన్ ఆలియా భట్ ఈ సినిమాలో మరింత అందంగా కనిపిస్తుంది’ అని ఉమైర్ సంధు ట్వీట్ చేసాడు.. ఇక ఈ సినిమా తరువాత రాజమౌళి ఇండియాలోనే నెంబర్ 1 డైరెక్టర్గా మారిపోతాడని డైరెక్టర్ రాజమౌళీపై ప్రశంసల జల్లు కురిపిస్తూ మరో ట్వీట్ చేశాడు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…