Sai Dharam Tej: సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ గత రెండు సంవత్సరాల క్రితం ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. బైక్ పై ప్రయాణిస్తూ ఉండగా ఒక్కసారిగా ఈయన అదుపుతప్పి పడిపోవడంతో తీవ్రగాయాలు పాలయ్యారు. దీంతో 12 రోజులపాటు కోమాలో ఉన్నటువంటి సాయి ధరంతేజ్ కు పలు సర్జరీలు కూడా నిర్వహించి ఈయనని ప్రాణాలతో కాపాడారు.

ఈ విధంగా సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురికావడంతో ఈ ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత ఈయన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు అని తెలుస్తుంది.సాధారణంగా ఎవరికైనా మరణం అంచులు దాకా వెళ్లి వస్తే తిరిగి ఆ పని చేయాలంటే భయపడతారు. ఈ క్రమంలోనే సాయి ధరంతేజ్ కూడా ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత బైక్ నడపాలి అంటే చాలా భయపడ్డారట.
ఇలా బైక్ అంటేనే భయం ఉన్నటువంటి ఈయనని తన తల్లి ఆ భయం నుంచి బయటకు తీసుకు వచ్చారని తెలిపారు.తను కాస్త కోలుకున్న తర్వాత స్వయంగా తన అమ్మ తనకు కీస్ ఇచ్చి బైక్ నడపమని చెప్పారని సాయి తేజ్ వెల్లడించారు. మొదట్లో తన ఇంటి పార్కింగ్ లోనే మెల్లిమెల్లిగా బైక్ నడిపే వాడినని ఆ తర్వాత కాస్త దూరం వెళ్లానని సాయి ధరంతేజ్ వెల్లడించారు.

Sai Dharam Tej: తాతయ్య బైక్ కొనిచ్చారు…
ఇప్పుడు తాను మామూలుగానే బైక్ నడుపుతున్నానని ఈయన తెలియచేశారు. అయితే ప్రమాదానికి గురైన ఆ బైక్ ఏం చేశారన్న ప్రశ్న కూడా తనకు ఎదురు కావడంతో ఆ బైక్ తనకు తన తాతయ్య కొనిచ్చారని అయితే ప్రమాదం జరిగిన తర్వాత అది పూర్తిగా పాడవడంతో మరొక బైక్ కొనుగోలు చేసి దానిని అమ్మేశాను అంటూ ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి.





























