Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గతంలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సమయంలో అబ్దుల్ ఫర్హాన్ అనే వ్యక్తి సాయి ధరమ్ తేజ్ ని గుర్తించి సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్చటం వల్ల సాయి ధరమ్ తేజ్ ఈరోజు ఇలా ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే అబ్దుల్ గురించి గత కొన్ని రోజులగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి.
సాయి ధరమ్ తేజ్ ని కాపడినందుకు మెగా కుటుంబం అతనికి పెద్దమొత్తంలో డబ్బు సాయం చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల ‘ విరూపాక్ష ’ సినిమా ప్రమోషన్స్లో అబ్దుల్ గురించి అతనికి చేసిన సహాయం గురించి సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తన ప్రాణాలు కాపాడిన వ్యక్తికి డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవడం మానవత్వం కాదని, అతడికి తన కాంటాక్ట్ నంబర్ ఇచ్చి అండగా ఉంటానని హామీ ఇచ్చానట్లు తెలిపాడు.
సాయి ధరమ్ తేజ్ ఇలా చెప్పటంతో మీడియా అబ్దుల్ను కలసి తేజ్ చెప్పిన మాటలలో వాస్తవం ఎంత ఉందని అడగగా… తనను సాయి తేజ్ లేదా మెగా కుటుంబం నుంచి ఎవరూ కలవలేదన్నారు. తనకు సాయం చేసేందుకు ఎవరూ ఫోన్ చేయలేదని , వారి వల్ల ఉన్న ఉద్యోగం కూడా వదులుకోవాల్సి వచ్చిందని తెలిపాడు.
దీంతో సోషల్ మీడియాలో సాయి ధరమ్ తేజ్ ని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ విమర్శలపై స్పందించిన సాయిధరమ్ తేజ్ స్పందిస్తూ..
తన మీద, తన టీమ్ మీద కొన్ని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని, అబ్దుల్ ఫర్హాన్కు ఆర్థికంగా సాయం చేసినట్లు తాను ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశాడు. అబ్దుల్ తనకు చేసిన సాయానికి తాను, తన కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపాడు. అంతే కాకుండా ఏ అవసరం వచ్చినా అబ్దుల్ ఫర్హాన్ ఎప్పుడైనా మేనేజర్ ద్వారా తనను కలవొచ్చని, అతని మంచి కోసం నేను ఎంత దూరమైన వెళ్తానని సాయి ధరమ్ తేజ్ క్లారిటీ ఇచ్చాడు. ఈ కాంట్రవర్సీ మీద ఇదే తన చివరి స్పందన అని సాయి తేజ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…