Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా విరూపాక్ష సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రమాదం నుండి కోలుకున్న తర్వాత సాయిధరమ్ తేజ్ నటించిన మొదటి సినిమా విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకత్వంలో సంయుక్త మీనన్, సాయిధరమ్ తేజ్ జంటగా నటించిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుండి హిట్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది. అంతే కాకుండా థియేటర్ల వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
ఈ సినిమా హిట్ అవ్వటంతో సాయిధరమ్ తేజ్ ఫుల్ ఖుషి అవుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా సినిమా సక్సెస్ అయిన సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించాడు. సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న సాయిధరమ్ తేజ్ తన వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నాడు. ఇక తాజా గా సినిమా సక్సెస్ అయిన సందర్భంగా సోషల్ మీడియాలో #AskSDT పేరుతో అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.
ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఈ మేరకు ‘ప్రస్తుతం మీకు ఏ నటి అంటే మీకు క్రష్ అని ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ.. సమంత అని సమధానం చెప్పాడు . అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న హీరోలలో మీ అభిమాన హీరో ఎవరు? ప్రశ్నించగా.. మాస్ మహారాజ రవితేజ, ప్రభాస్ అని సమధానం చెప్పాడు.
మెగా కాంపౌండ్ లో అంత మంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ రవితేజ, ప్రభాస్ అంటే ఇష్టం అని సాయిధరమ్ తేజ్ చెప్పటంతో మెగా అభిమానులు అసంతృప్తిగా ఉన్నప్పటికీ ప్రభాస్, రవితేజ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ప్రస్తుతం విరూపాక్ష సక్సెస్ ని సాయిధరమ్ తేజ్ ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేకాకుండా తాజాగా విరూపాక్ష పార్ట్-2 కూడా ఉండబోతుందని ప్రకటించాడు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…