Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా విరూపాక్ష సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రమాదం నుండి కోలుకున్న తర్వాత సాయిధరమ్ తేజ్ నటించిన మొదటి సినిమా విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకత్వంలో సంయుక్త మీనన్, సాయిధరమ్ తేజ్ జంటగా నటించిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుండి హిట్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది. అంతే కాకుండా థియేటర్ల వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
ఈ సినిమా హిట్ అవ్వటంతో సాయిధరమ్ తేజ్ ఫుల్ ఖుషి అవుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా సినిమా సక్సెస్ అయిన సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించాడు. సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న సాయిధరమ్ తేజ్ తన వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నాడు. ఇక తాజా గా సినిమా సక్సెస్ అయిన సందర్భంగా సోషల్ మీడియాలో #AskSDT పేరుతో అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.
ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఈ మేరకు ‘ప్రస్తుతం మీకు ఏ నటి అంటే మీకు క్రష్ అని ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ.. సమంత అని సమధానం చెప్పాడు . అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న హీరోలలో మీ అభిమాన హీరో ఎవరు? ప్రశ్నించగా.. మాస్ మహారాజ రవితేజ, ప్రభాస్ అని సమధానం చెప్పాడు.
మెగా కాంపౌండ్ లో అంత మంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ రవితేజ, ప్రభాస్ అంటే ఇష్టం అని సాయిధరమ్ తేజ్ చెప్పటంతో మెగా అభిమానులు అసంతృప్తిగా ఉన్నప్పటికీ ప్రభాస్, రవితేజ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ప్రస్తుతం విరూపాక్ష సక్సెస్ ని సాయిధరమ్ తేజ్ ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేకాకుండా తాజాగా విరూపాక్ష పార్ట్-2 కూడా ఉండబోతుందని ప్రకటించాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…