Prashanth Neel: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమై ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒకరు. ఈయన మొదట ఉగ్రం అనే సినిమాకు దర్శకుడుగా పనిచేశారు ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయినటువంటి ప్రశాంత్ అనంతరం కే జి ఎఫ్ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అయింది.

ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయనకు తెలుగులో అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ ఎన్టీఆర్ వంటి హీరోలతో సినిమాలు చేయడానికి కమిట్ అయ్యారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు త్వరలోనే ఈ సినిమా పార్ట్ 2 షూటింగ్ పనులను కూడా జరుపుకోవాలని ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమాతో బిజీ కానున్నారు.
ఇక ఈయన మొదట దర్శకత్వం వహించిన ఉగ్రం సినిమా విడుదలై 10 సంవత్సరాలు అవుతున్నటువంటి తరుణంలో ఈయన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు ఒక విషయాన్ని తెలియజేశారు. ఎవరైనా సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటే నన్ను ఫాలో అయ్యి ఇండస్ట్రీలోకి రావద్దని తెలిపారు. నేను డైరెక్టర్గా ఉగ్రం సినిమాకు పని చేయడానికంటే ముందు ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేయలేదు ఒక షార్ట్ ఫిలిం కూడా తీయలేదని తెలిపారు.
నాలుగు సంవత్సరాలు..
ఇలా ఎక్కడ పని చేయకుండా డైరెక్టర్గా రావడంతో తాను ఆరు నెలలలో చేయాల్సిన సినిమాని నాలుగు సంవత్సరాలు చేశానని దీంతో నిర్మాతలతో పాటు నేను కూడా అధిక ఒత్తిడికి గురయ్యానని తెలిపారు. అందుకే ఎవరు కూడా ఈ విషయంలో తనని ఫాలో అయ్యి తప్పు చేయొద్దని ప్రశాంత్ నీల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.





























