Samantha: నాగచైతన్య సమంత పెళ్లయిన తర్వాత కొన్ని రోజుల పాటు సంతోషంగా ఉన్నప్పటికీ వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. వీరి విడాకుల గురించి ఎన్నో వార్తలు రాగా, తాజాగా సమంత కాఫీ విత్ కరణ్ టాక్ షోలో అసలు విషయాలు చెబుతూ తన గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు.ఇకపోతే వివాహమైన తర్వాత వీరిద్దరూ ప్రముఖ నటుడు మురళీమోహన్ ఇంటిని కొనుక్కొని అక్కడే ఉండేవారని ఇదివరకు ఇంటర్వ్యూలో మురళీమోహన్ వెల్లడించారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళి మోహన్ సమంత గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సమంత నాగచైతన్య వివాహమైన తర్వాత మా ఇంటిని కొనుక్కొని ఇక్కడే ఉన్నారు.ఈ ఇంటిలో ఉంటూ వారిద్దరూ కలిసి ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలని ఒక కొత్త ఇంటిని కొన్నారు. అయితే ఆ సమయంలోనే ఆ ఇంటిని వేరే వాళ్లకు అమ్మారు. ఇకపోతే వాళ్లు కొన్న ఇల్లు రీ మోడలింగ్ చేసేవరకు అదే ఇంట్లో ఉంటామని ఓనర్ వాళ్ళను ఒప్పించి అక్కడే ఉన్నారని మురళీమోహన్ తెలిపారు.
ఇక సమంత నాగచైతన్య కొన్న ఇల్లు రీ మోడలింగ్ పూర్తి కాకుండానే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు.ఇకపోతే సమంత తను ఉండడం కోసం సిటీలో ఎన్నో చోట్ల ఇంటి కోసం తిరిగినప్పటికీ తనకు ఎక్కడ ఇలాంటి ఇల్లు దొరకకపోవడంతో తిరిగి తన వద్దకు వచ్చి ఆ ఇల్లు కావాలని అడిగినట్లు మురళీమోహన్ తెలిపారు.
అప్పటికే సమంత నాగచైతన్య ఆ ఇంటిని వేరే వాళ్లకు అమ్మడంతో వాళ్లతో మాట్లాడి మరింత ఎక్కువ డబ్బు చెల్లించి తిరిగి ఆ ఇంటిని సొంతం చేసుకున్నారని మురళీమోహన్ వెల్లడించారు.ఇలా ఈ ఇంటిలో తనకు ఎంతో సేఫ్టీ గా ఉంటుందని, సెక్యూరిటీ పరంగా అదే మంచి ఇల్లు అనీ నిర్ణయించుకున్న సమంత అదనపు డబ్బులు చెల్లించి ఆ ఇంటిని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె తన తల్లితో కలిసి అక్కడే నివసిస్తున్నారని మురళీమోహన్ ఈ సందర్భంగా ఆ ఇంటి గురించి తెలిపారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…