Samantha: అనారోగ్యం నుండి కోలుకున్న తర్వాత సమంత వరుస షూటింగ్లలో పాల్గొంటూ బిజీగా ఉంది. ఇటీవల సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదలై అంచనాలను అందుకోలేక అందరిని నిరాశపరిచింది. ప్రస్తుతం సీటాడెల్ ప్రమోషన్ పనులతో సమంతా బిజీగా ఉంది. సీటాడెల్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 28వ తేదీ విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్ లో భాగంగా లండన్ లో ప్రీమియర్ షో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సమంత చాలా స్టైలిష్ గా సరికొత్త లుక్ లో కనిపించారు. బ్లాక్ డ్రెస్, ఖరీదైన డైమండ్ జువెలరీతో చాలా స్టైలిష్ లుక్ లో కనిపించింది.
అయితే ఈ వేడుకలో సమంత స్పీచ్ గురించి అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వెబ్ సీరీస్ లో భాగం కావటంతో సమంత చాలా ఎక్సైట్డ్ గా ఉంది. ఈ క్రమంలో తాను మాట్లాడిన తీరులో చాలా మార్పు కనిపించింది.
విదేశాలకు వెళ్ళగానే యాస మార్చింది. ఈ ఫేక్ యాక్సెంట్ అవసమా? అంటూ సమంత మాట్లాడిన వీడియోని షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. అయితే కొంతమంది అభిమానులు ఈ విషయంలో ఆమెను వెనకేసుకొస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే సమంతా గురించి అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.
శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత తన అనారోగ్యం గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది.
తన ఆరోగ్యం సహకరించకపోయినా శాకుంతలం మీద ఉన్న ఇష్టంతో ప్రమోషన్స్ లో పాల్గొన్నట్లు తెలిపింది. ఈ క్రమంలో కొంతమంది ఆమె తీరుని తప్పు పడుతూ.. కేలవం సినిమా సక్సెస్ చేయటానికి సమంత ఇలా సింపతీ కార్డు ప్లే చేస్తోంది అంటూ విమర్శలు చేశారు. అయితే కంటెంట్ లేకపోవటంతో సినిమాని ప్రేక్షకులు ఆదరించలేదు. అయితే శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో సమంత తెల్లటి రంగు దుస్తులు ధరించి చేతిలో జప మాలతో ఉన్న సమంత సీటాడెల్ ప్రమోషన్స్ కోసం దేశం దాటగానే రూపం మార్చింది అంటూ విమర్శలు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…