Samantha: సమంత ప్రస్తుతం సినిమాలకు విరామం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి సమంతా ఎంతో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గడపడానికి ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా తన వెకేషన్ లకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఇలా బాలీ వెకేషన్ పూర్తి చేసుకున్న ఈమె తిరిగి చెన్నై చేరుకున్నారు.
ఇలా సమంత చెన్నై తిరిగి రాగానే ఈమె తన ప్రాణ స్నేహితురాలు సింగర్ చిన్మయి ఇంటికి వెళ్లారు. సమంత చిన్మయి ఎంత ప్రాణ స్నేహితులో మనకు తెలిసిందే.ఇలా చిన్మయి ఇంటికి వెళ్లినటువంటి సమంత అక్కడ తన పిల్లలతో కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నారు ఇలా చిన్మయి పిల్లలతో సమంత ఆడుకుంటూ వారితో కలిసి డ్యాన్సులు చేస్తూ ఉన్నటువంటి వీడియోలను ఈమె ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
ఈ విధంగా సమంత కూతురిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని తనతో కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులు వేయించారు. అనంతరం తన ఇద్దరి కూతురులతో పోటీపడుతూ ఎంతో ఎంజాయ్ చేస్తూ కనిపించారు.ఇలా చాలా రోజుల తర్వాత సమంత పిల్లలతో కలిసి ఇలా ఎంతో ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ కనిపించడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి సామ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మయూసైటిసిస్ కారణంగా సినిమాలకు విరామం ప్రకటించినటువంటి ఈమె త్వరలోనే ట్రీట్మెంట్ కూడా తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఈలోపు ఈమె తనకెంతో ఇష్టమైనటువంటి ప్రదేశాలకు వెళుతూ తన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా సినిమాలకు దూరమైనటువంటి సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు.
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…