Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సమంత ఒకరు. ఇzక సమంత ప్రస్తుతం నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోని పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సమంత పూర్తిగా తెలుగు మీడియాని దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది.
ఇతర చిత్ర బృందం పెద్ద ఎత్తున మీడియా సమావేశంలో మాట్లాడుతున్నప్పటికీ సమంత మాత్రం తెలుగు మీడియా ముందుకు రావడానికి సంకోచిస్తున్నారు. అయితే ఈమె బాలీవుడ్ మీడియా సమావేశాలలో పాల్గొనడం అలాగే పలు సిరీస్ ల షూటింగ్లకు హాజరు కావడం జరుగుతుంది. అలాగే సోషల్ మీడియా వేదికగా కూడా పెద్ద ఎత్తున సినిమాని ప్రమోట్ చేస్తున్నారు.
ఇలా బాలీవుడ్ మీడియాకు, సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్ గా ఉండే సమంత ఎందుకు తెలుగు మీడియాకు దూరంగా ఉంటుంది ఉద్దేశపూర్వకంగానే ఈమె తెలుగు మీడియాను దూరం పెడుతున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.అయితే తెలుగు మీడియా ముందుకు సమంత వస్తే తన వ్యక్తిగత విషయాల గురించి ప్రశ్నిస్తారన్న కారణంతోనే ఈమె తెలుగు మీడియా ముందుకు రావడంలేదని తెలుస్తోంది.
ఇదివరకే యశోద సినిమా ప్రమోషన్లలో కేవలం ఒకరోజు మాత్రమే యాంకర్ సుమతో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అలాగే శాకుంతలం సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె కేవలం యాంకర్ సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలలో భాగంగా సమంత టీం తన వ్యక్తిగత విషయాల గురించి అడగకూడదని ముందుగానే చెప్పారట. అందుకే తన పెళ్లి విడాకుల గురించి ఎక్కడ ప్రస్తావించకుండా కేవలం సినిమా గురించి మాత్రమే మాట్లాడుతూ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. మరి సమంత తెలుగు మీడియా ముందుకు రాకపోవడానికి గల కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…