Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సమంత ఒకరు. ఇzక సమంత ప్రస్తుతం నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోని పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సమంత పూర్తిగా తెలుగు మీడియాని దూరం పెడుతున్నట్లు తెలుస్తోంది.
ఇతర చిత్ర బృందం పెద్ద ఎత్తున మీడియా సమావేశంలో మాట్లాడుతున్నప్పటికీ సమంత మాత్రం తెలుగు మీడియా ముందుకు రావడానికి సంకోచిస్తున్నారు. అయితే ఈమె బాలీవుడ్ మీడియా సమావేశాలలో పాల్గొనడం అలాగే పలు సిరీస్ ల షూటింగ్లకు హాజరు కావడం జరుగుతుంది. అలాగే సోషల్ మీడియా వేదికగా కూడా పెద్ద ఎత్తున సినిమాని ప్రమోట్ చేస్తున్నారు.
ఇలా బాలీవుడ్ మీడియాకు, సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్ గా ఉండే సమంత ఎందుకు తెలుగు మీడియాకు దూరంగా ఉంటుంది ఉద్దేశపూర్వకంగానే ఈమె తెలుగు మీడియాను దూరం పెడుతున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.అయితే తెలుగు మీడియా ముందుకు సమంత వస్తే తన వ్యక్తిగత విషయాల గురించి ప్రశ్నిస్తారన్న కారణంతోనే ఈమె తెలుగు మీడియా ముందుకు రావడంలేదని తెలుస్తోంది.
ఇదివరకే యశోద సినిమా ప్రమోషన్లలో కేవలం ఒకరోజు మాత్రమే యాంకర్ సుమతో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అలాగే శాకుంతలం సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె కేవలం యాంకర్ సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలలో భాగంగా సమంత టీం తన వ్యక్తిగత విషయాల గురించి అడగకూడదని ముందుగానే చెప్పారట. అందుకే తన పెళ్లి విడాకుల గురించి ఎక్కడ ప్రస్తావించకుండా కేవలం సినిమా గురించి మాత్రమే మాట్లాడుతూ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. మరి సమంత తెలుగు మీడియా ముందుకు రాకపోవడానికి గల కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…