Samantha: స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యం గురించి అందరికీ తెలిసిందే. నాగచైతన్య నుండి విడిపోయిన తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిన సమంత ఆ తర్వాత డిప్రెషన్ నుండి బయటపడటానికి వరుస సినిమాలలో నటిస్తూ బిజీ అయ్యింది. అయితే ఆ సమయంలో ఆమె మయోసైటీసిస్ వ్యాధి బారిన పడింది. దీంతో దాదాపు నాలుగు నెలల పాటు ఆమె మీడియా ముందు, సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కనిపించలేదు.
ఆ తర్వాత తాను మయోసైటీసిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అంతేకాకుండా ఆమె చికిత్స పొందుతున్నట్లు కూడా తెలిపింది.అనారోగ్యం వల్ల సమంత యశోద సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొనలేకపోయింది. ఇక ఇటీవల సమంత ఆరోగ్యం కొంతవరకు కుదుటపడటంతో తాజాగా విడుదలైన శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనింది. అయితే అప్పటికి ఆమె ఆరోగ్యం ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలిపింది.
ఈ క్రమంలో తాజాగా సమంత షేర్ చేసిన ఒక ఫోటో అభిమానుల్లో ఆందోళన రేపింది. ఆక్సిజన్ మాస్క్ తో ఉన్న సమంత ఫోటో చూసిన ఆమె అభిమానులు మళ్లీ ఏమైందంటూ? ఆందోళన చెందుతున్నారు. అయితే ఆ తర్వాత ఆమె షేర్ చేసిన మరొక ఫోటో చూసి సమంత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. హైపర్బేరిక్ థెరపీ కోసం సమంతాల ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్నట్లు క్లారిటీ వచ్చింది.
హైపర్బేరిక్ థెరఫీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి సమంత తెలుపుతూ.. కండరాల వాపు, ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. పాడైన కండరాలను బాగుచేస్తుందని వెల్లడించింది. సమంతకి మయోసైటిస్ సోకిన నేపథ్యంలో ఆమె ఈ హైపర్బేరిక్ థెరఫీ తీసుకుంటున్నట్లు అర్థం అవుతుంది. మయోసైటిస్ నుండి సమంత పూర్తిగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం సీటాడెల్ ప్రమోషన్ పనులలో సమంత బిజీగా ఉంది. అంతే కాకుండా మరొకవైపు ఖుషి సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…