Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి సమంత ప్రస్తుతం కెరియర్ కు కాస్త విరామం ప్రకటించి తన ఆరోగ్యాన్ని కాపాడుకునే పనులలో ఉన్నారు.. సమంత మయోసైటిసిస్ వ్యాధికి గురైన సంగతి మనకు తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఈమె సినిమాలకు కాస్త విరామం ప్రకటించి పూర్తిగా ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా సమంత ఇండియా టుడే కాన్ క్లేవ్ 2024 న్యూఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరవ్వడానికంటే ముందుగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్ కి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు.
ఈ క్రమంలోనే సమంతకు ఇండస్ట్రీలో క్రష్ ఎవరు అనే విషయాన్ని కూడా ఈమె ఈ సందర్భంగా వెల్లడించారు. నాకు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి షారుక్ ఖాన్ గారు అంటే ఎంతో గౌరవం అని తెలియజేశారు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే ప్రభాస్ తో ఇప్పటివరకు ఈమె నటించకపోయినా ప్రభాస్ అంటే తనకు చాలా గౌరవమని తెలిపారు.
అల్లు అర్జున్..
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ నా క్రష్ అంటూ ఈ సందర్భంగా సమంత చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ నాకు అల్లు అర్జున్ సినీ రోల్ మోడల్ అని చెప్పినటువంటి ఈమె ఇప్పుడు అల్లు అర్జున్ తన క్రష్ అంటూ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…