భారతీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇందులో దాదాపు చాలామందికి అకౌంట్ ఉంటుంది. ఎక్కువ బ్రాంచ్ లు, ఏటీఎంలు, ఖాతాదారులు కలిగిన బ్యాంక్ గా ఎస్బీఐ ప్రసిద్ధి. అయితే ఇందులో క్రెడిట్ కార్డు వాడే వారి సంఖ్య కూడా పెరిగింది. అయితే ఇప్పటి వరకు క్రెడిట్ కార్డు లావాదేవీలపై ఎలాంటి చార్జీలు విధించేవారు కాదు.
అంటే ఈఎంఐ విషయంలో ఇలాంటి నిబంధన ఉండేది కాదు. కొన్ని కొన్ని కొనుగోళ్లకు మాత్రం చార్జ్ వసూలు చేసేవారు. అయితే తాజాగా క్రెడిట్ కార్డు వాడే వినియోగదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాక్ ఇచ్చింది. ఇక పై ఎస్బీఐ క్రెడిట్ కార్డుల ద్వారా చేపట్టిన ఈఎంఐ లావాదేవీలపై రూ.99 ప్రాసెసింగ్ ఫీజు విధించనున్నట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు. దాంతో పాటు పన్నులూ వసూలు చేస్తామని తెలిపారు.
ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఒక మెయిల్ ద్వారా చేరవేశారు. అయితే ఇప్పుడే ఈ నిబంధన అమల్లోకి రాదని.. 2021 డిసెంబర్ 1 నుంచి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నిబంధన కారణంగా వినియోగదారులపై అదనపు భారం పడుతుందని ఖాతాదారులు వాపోతున్నారు. అకస్మాత్తుగా ఫీజు వసూలు చేసే నిబంధన విధించడం కరెక్ట్ కాదంటూ అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా.. దసరా, దీపావళి ఫెస్టివల్ సందర్భంగా ఈ కార్డును ఉయోగించి అమెజాన్, ఫ్లిప్ కార్డ్ వంటి ఈ కామర్స్ సంస్థల్లో కొనుగోలు చేస్తే 10 శాతం వరకు డిస్కౌండ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఎక్కువగా ఎస్బీఐ కార్డును ఉపయోగించారని సమాచారం.
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…
దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…