General News

ప్రిన్సిపాల్స్ గొప్ప మనసు… ఏకంగా 200 మందికి ఫీజు చెల్లింపు.. ఎక్కడంటే?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది పాఠశాలలు మూతపడ్డాయి. ఈ క్రమంలోనే కొన్ని పాఠశాల యాజమాన్యాలు ఆన్లైన్ పద్ధతి ద్వారా తరగతులను బోధిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా క్లాసులు జరుగుతున్నప్పటికీ ఎంతోమంది చదువుకు దూరం అయ్యారు. కరోనా ప్రభావం వల్ల ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. ఈ క్రమంలోనే తమ పిల్లలకు ఫీజులు చెల్లించి చదివించడం భారం అవుతున్న నేపథ్యంలో చాలా మంది పిల్లలు చదువులు మానేస్తున్నారు.

ఇలాంటి సమయంలోనే మహారాష్ట్రకు చెందిన ఒక స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్థుల చదువు కోసం గత ఏడాది నుంచి విరాళాలను సేకరిస్తున్నారు.ముంబైలోని పోవై ఇంగ్లీష్ హైస్కూల్ ప్రిన్సిపాల్ షిర్లే పిళ్లై ఇప్పటి వరకు రూ.40 లక్షలు సేకరించగలిగారు. దీని ద్వారా 200 మంది పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించారు.కరోనా ప్రభావం వల్ల తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల లో 50 శాతం మంది ఫీజులు చెల్లించలేక చదువుకు దూరమవుతున్నట్లు గ్రహించిన ప్రిన్సిపల్ ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో తన స్కూల్ ఫీజులను సగానికి తగ్గించారు.

ఈ విధంగా సగం ఫీజు కూడా చెల్లించలేని విద్యార్థుల కోసం ఆమె విరాళాలు సేకరించడం మొదలు పెట్టారు.ఎన్నో ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో ను సంప్రదించి విరాళాలు సేకరిస్తున్న ప్రిన్సిపల్ ఈ ఏడాది సుమారు 200 మంది పిల్లల ట్యూషన్ ఫీజులు చెల్లించింది. వచ్చే ఏడాదికి కూడా ఈమె విరాళాలను సేకరిస్తున్నారు.

ఈ కరోనా ప్రభావంతో ఎంతో మంది బాలికలు చదువుకు దూరమయ్యే అవకాశం ఉందని గ్రహించిన ప్రిన్సిపల్షిర్లే ఈ పరిస్థితి ఎవరికీ రాకుండా ముందుగానే విరాళాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర మొత్తం కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న నేపథ్యంలో ఈమె నిధుల సేకరణ ఆపడం లేదు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ ఏడాది కన్నా వచ్చే ఏడాది మరింత ఎక్కువ నిధులను సేకరించి మరి కొంతమంది పిల్లల చదువులు ఆగకుండా చూడాలన్నదే తన ఉద్దేశమని తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

4 hours ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

4 hours ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

4 hours ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

4 hours ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

4 hours ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

4 hours ago