Senior Actor Kakarala Sathyanarayana : నాటక రంగం నుండి సినిమా రంగానికి వచ్చిన నటులలో కాకరాల ఒకరు. సుమారు రెండుందలకు పైగా సినిమాల్లో నటించిన ఆయన దిగ్గజ నటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో నటించారు. అలానే కామెడీ, విలనీజం రెండింటిని పండించిన ఆయన బి.ఎన్ రెడ్డి గారి రంగుల రాట్నం సినిమాకు మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన మా భూమి వంటి సినిమాల్లో అలాగే చిరంజీవి గారి సినిమాల్లో తొలినాళ్ళలో నటించారు. అలనాటి సినిమా విశేషాలను తాజాగా ఓక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

రామోజీ రావు ను అనడానికి నువ్వు ఎవరు…
పాత తరం నటులు వారి జీవిత విశేషాల గురించి మాట్లాడుతూ కాకరల గారు పలు ఆసక్తికర అంశాలను మాట్లాడారు. కొంతమంది నటులు ప్రతిభ ఉన్న సినిమా రంగంలో ఎక్కువ కాలం మనుగడ సాగించలేక పోడానికి వారు చేసిన స్వీయ అపరధాలే కాకుండా అప్పటి ఇండస్ట్రీ లోని రాజకీయాలు కూడ ఉన్నాయని కానీ వాటిని పైకి మనం చెప్పుకోమని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు రామోజీ రావు మోనార్క్ లాగా ఏలాడు . ఆయన సామ్రాజ్యం స్థాపించాడు.

ఇపుడు ఆయన పని అయిపోయింది అన్నట్లుగా చాలా మంది మాట్లాడుతున్నారు. ఆనాడు ఆ మాటతప్పే, ఇపుడు ఈ మాట తప్పే అంటాను అంటూ కాకరాల తెలిపారు. ఆయన టైం బాగున్నపుడు వెలుగు వెలిగాడు ఇపుడు ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు. ఒక మహాప్రవాహం వచ్చినపుడు ముందున్న నీరు కొట్టుకుపోవాల్సిందే అలాగే మరో మహా ప్రవాహం వచ్చినపుడు ఈ కెరటం అంతే అది జీవితంలోనూ జరుగుతుంది. వాటిని అంగీకరించి నిశ్శబ్దంగా పక్కకు తప్పుకోవడమే మనం చేయాల్సిన పని అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.





























