Senior Actor Krishna veni : 1979 లో ‘నగ్న సత్యం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నటి కృష్ణ వేణి ఆ సినిమా తరువాత పలు సినిమాల్లో హీరోయిన్ గానూ అలాగే సహాయక పత్రాల్లోనూ నటించారు. ‘వారాలబ్బాయ్’ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు అందుకున్న కృష్ణ వేణి గారు ఆ సినిమా డైరెక్టర్ రాజచంద్ర ను పెళ్లి చేసుకున్నారు. అప్పటికే పెళ్ళై పిల్లలున్న రాజచంద్ర ను పెళ్లి చేసుకున్నాక కొన్నేళ్లకు ఆయన అనుమానాస్పద రీతిలో మరణించారు. ఇక కృష్ణ వేణి గారి చెల్లి కూడా నటిగా అందరికీ సుపరిచితురాలే. ఇక కృష్ణ వేణి గారు ప్రస్తుతం సినిమాలను తగ్గించినా సీరియల్స్ లో కనిపిస్తున్నారు. ఇక ఆమె ఆస్తుల గురించి కుటుంబం గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

మణికొండలో ఆస్తులన్నీ మనవరాలికి ఇచ్చేసాను…
కృష్ణ వేణిగారు అంతకు ముందు ఉన్న ఎంతో మంది నటులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం చూసి మొదటి నుండి జాగ్రతగా ఉండేవారట. అందుకే కంచంలో నాలుగు ముద్దలు ఉంటేనే ఇతరులకు రెండు ముద్దలు ఇచ్చేదాన్ని కానీ నాకే రెండు ముద్దలు ఉంటే ఇచ్చేదాన్ని కాదు, అలా సంపాదించుకున్న ఆస్తుల్సను కాపాడుకున్నాను అంటూ చెప్పారు.

నా పిల్లలందరికీ ఆస్తులన్నీ ఇచ్చేసాను. మానవరాలికి మణికొండలోని ఆస్తులు రాసిచ్చాను. ఇంక నా వద్ద నాకోసం కొంత పెట్టుకుని మొత్తం రాసిచ్చేసాను. చెన్నై, హైదరాబాద్ లో ఉన్న ఆస్తులు పిల్లలకు పంచేసాను అంటూ తెలిపారు. అందరినీ సెటిల్ చేసానని, ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేసానని చెప్పారు కృష్ణ వేణి.


































