Senior Actor Narasimharao : తెలుగులో జానపద హీరోగా బాగా గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో నరసింహ రాజు గారు ఒకరు. 1970 లలో అనేక జానపద సినిమాలలో నటించిన ఆయన విఠలాచార్య సినిమా ‘జగన్మోహిని’ ద్వారా సూపర్ హిట్ అందుకున్నారు. అప్పట్లో నరసింహ రాజు, హీరోయిన్ ప్రభ హిట్ పెయిర్ గా నిలిచారు. సినిమాల మీద మక్కువతో నరసింహారాజు గారు మద్రాస్ వెళ్లి ప్రయత్నం చేయడంతో అవకాశాలు వచ్చాయి. నీడలేని ఆడది వంటి సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన నరసింహ రాజు గారు, విఠలాచర్య గారి పరిచయంతో ఆయన కెరీర్ మారిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన నరసింహరాజు గారు దాదాపు గా 110 సినిమాల్లో నటించారు.

నన్ను చెప్పకుండా తీసేసి చంద్రమోహన్ ను పెట్టుకున్నారు… డబ్బు అలా పోగొట్టుకున్నాను…
కన్నడ సినిమాతో మొదలై ఆ తరువాత తెలుగులో నీడలేని ఆడది సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నరసింహారాజు గారు నీడలేని ఆడది సినిమా కంటే ముందే తెలుగులో సినిమా అవకాశం అందుకున్నారు. మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో ‘ప్రజానాయకుడు’ సినిమాకు ఎంపిక చేశారు. జగ్గయ్య, జానకి ల అబ్బాయి పాత్రలో నటించాలి. రెండు రోజుల షూటింగ్ తరువాత సినిమాలో నుండీ తీసేసారు. నిజానికి అప్పటికి నరసింహారాజు గారు లావుగా ఉన్నారట. మొదట చూసినపుడు బాగున్నాడని సినిమాకు తీసుకున్నా కెమెరా ఫ్రేమ్ లో చూసినపుడు బాగా లావుగా కనిపిస్తూ ఉండటం తో సినిమా నుండి తీసేసి చంద్రమోహన్ గారిని ఆ పాత్రలో పెట్టుకున్నారట.

దీంతో కసిగా సన్న బడి నీడలేని ఆడది సినిమాలో అవకాశం దక్కించుకున్నానని నరసింహారాజు గారు తన అనుభవాలను పంచుకున్నారు. ఇక సినిమాల్లో ఐదు వేలు వస్తే పదివేల ఖర్చు చేయడం వల్ల ఆస్తులను సంపాదించుకోలేదంటూ ఆయన తెలిపారు. తండ్రి దానధర్మాల వల్ల ఆస్తులన్నీ కరిగిపోయాయని ఇక నేను బ్రతకడానికి నా ఖర్చులకు సంపాదించడం మొదలు పెట్టాను. ఎప్పటికప్పుడు నేను సంపాదించింది ఇంటి ఖర్చులకు అయిపోయింది పెద్దగా ఆస్తులను చేయలేకపోయాను కానీ చెడు అలవాట్లు కూడా లేవు నాకు అంటూ కేవలం పేకాట అదేవాడిని అదికూడా చాలా మితంగానే క్లబ్ లో ఆడేవాడిని అంటూ చెప్పారు నరసింహారాజు గారు.

































