Senior Artist P.R. Varalakshmi : నగరి కి చెందిన పిఆర్ వరలక్ష్మి గారు తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ హిందీ, మలయాళం ఇలా పలు భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వందల సినిమాల్లో నటించిన వరలక్ష్మి గారు ‘కృష్ణావతారం’ సినిమా ద్వారా తెలుగులో పరిచయమయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణం రాజు ఇలా అందరు హీరోలతో నటించిన ఆమె మహేష్ బాబు, బాలకృష్ణ ఇలా తరువాత తరం వారితోనూ నటించారు. తమిళంలో సీరియల్స్ లో నటిస్తున్న వరలక్ష్మి గారు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.

తెలుగు ఇండస్ట్రీ పట్టించుకోలేదు… అందుకే కోపం…
తెలుగు ఆర్టిస్ట్ అయిన వరలక్ష్మి గారు వందల సినిమాల్లో నటించారు. అయితే తెలుగులోనే ఎక్కువగా నటించినా కూడా అక్కడ ఆదరణ లేదంటూ చెప్పారు. ఆమె ప్రస్తుతం చెన్నై లో నివసిస్తున్నారు. తన ఇంట్లో కూడా కేవలం తమిళ, కన్నడ ఇండస్ట్రీల నుండి వచ్చిన అవార్డులను షీల్డ్ లను మాత్రమే ఉంచి తెలుగుకు సంబందించిన అవార్డులను షీల్డ్ లను తీసేసారు.

తెలుగు ఇండస్ట్రీ పట్టించుకోలేదని తెలుగు ఆర్టిస్ట్ అయినా కూడా నన్ను అసలు పట్టించుకోలేదని అందుకే నాకు కోపం అంటూ పి ఆర్ వరలక్ష్మి గారు తెలిపారు. తమ తాతలు, తండ్రుల దగ్గరి నుండి అందరూ తెలుగు నేలకు ఎంతో సేవ చేసినా నన్ను తెలుగు ఆర్టిస్ట్ గా గుర్తు పెట్టుకోలేదనే బాధ ఉంది కానీ తమిళ ఇండస్ట్రీ నన్ను అక్కున చేర్చుకుంది, ఇప్పటికీ సీరియల్స్ లో బిజీగా ఉన్నాను. సినిమాలను నేనే అవుట్ డోర్ వెళ్లాల్సి ఉంటుందని వద్దని భావించి చేయడం లేదు అంటూ తెలిపారు.



























