Senior Journalist Bhardwaja : అక్కినేని నాగేశ్వరావు గారు, నందమూరి తారక రామారావు గారు ఇద్దరికీ సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి హిట్స్ ఇచ్చిన ఒకేఒక దర్శకుడు దాసరి నారాయణ రావు గారు. అటు ఎన్టీఆర్ తో సర్ధార్ పాపారాయుడు, బొబ్బిలి సింహం వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దాసరి ఇక ఏఎన్ఆర్ తో ఏడంతస్థుల మేడ, శ్రీవారి ముచ్చట్లు, ప్రేమాభిషేకం, బహుదూరపు బాటసారి, మేఘ సందేశం వంటి సూపర్ హిట్లు ఇచ్చారు. ఇక ఒకరకంగా అక్కినేని వారు ఫ్లాపులతో సతమవుతున్న సమయంలో ఒక మంచి హిట్ ఇచ్చి అక్కినేని అభిమానులకు ఊరటనిచ్చారు.

వాళ్ళ మధ్య అందుకే విభేదాలు…
ఇక ఏఎన్ఆర్, దాసరి మధ్య అనుబంధం, విబేధాల గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మాట్లాడారు. ఇక మళ్ళీ ఏఎన్ఆర్ తో వరుస హిట్లు కొట్టిన దాసరి ఇక ఒకవైపు తెలుగులో హిట్లు కొడుతూ హిందీలో ఈ సినిమాలను రీమేక్ చేసి అక్కడ హిట్లు కొట్టారు. ఇక ఫుల్ బిజీ షెడ్యూల్ తో పనిచేస్తున్న సమయంలో దాసరి గారు అన్నపూర్ణ స్టూడియోలోనే పడుకునే వారు. అదీకాక హిందీ సినిమాలను కూడా అన్నపూర్ణ లో ఎక్కువగా తీసేవారు, అయితే కొన్నిసార్లు కొంతమంది ప్రొడ్యూసర్లకు పూచికత్తు ఉండటం వల్ల స్టూడియోకి బకాయి పడటం అది తీర్చలేక పోవడం వల్ల ఆయన అన్నపూర్ణ నుండి బయటికి రావాల్సి రావడంతో అక్కినేని తో విబేధాలు వచ్చాయి. ఇక నాగేశ్వరావు గారు దాసరి తో ఎక్కువ కలవడం, మాట్లాడటం చేయలేదు.

కానీ దాసరి గారు అప్పటికి తన అభిమాన నటుడు ఎవరు అంటే నాగేశ్వరావు గారి పేరు చెప్పేవారు. ఇక నాగార్జున తో ‘మజ్ను’ వంటి సినిమాలను చేసారు. ఇక ‘ఢమరుకం’ సినిమా సమయంలో విడుదల సమస్యలు ఉంటే నాగార్జున అడగటం తో దాసరి తన సిరి మీడియా సంస్థ ద్వారా విడుదల అడ్డంకిని తీర్చారు. అయినప్పటికీ ఆ ఫ్యామిలీ కి దూరంగానే ఉన్నారు దాసరి, ఇక తన జీవితంలోని విషయాల గురించి పుస్తకం రాయాలనే కోరిక ఉండేది, ఒక సందర్బంలో ఆ విషయం చెబుతూ రాస్తే స్టూడియో నుండి నన్ను గేంటేసిన విషయం లాంటివి చెప్పాల్సి వస్తుందని చెప్పారు అంటూ ఏఎన్ఆర్, దాసరి మధ్య ఉన్న విభేదాలను చెప్పారు భరద్వాజ.




























