Senior Journalist Bhardwaja : ఏపీ రాజకీయాల్లో టీడీపీ, వైసీపీ హోరా హోరీగా ఉంటే మరోవైపు జనసేన నేను ఉన్నా అంటూ గుర్తుచేస్తోంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలు వ్యూహ రచన చేస్తూ ఎత్తులు వేస్తున్న సమయంలో టీడీపీ తరుపున ఎన్నికల ప్రచారానికి మరోసారి జూనియర్ ఎన్టీఆర్ వస్తాడంటూ నందమూరి తారక రత్న చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం రాజకీయాల గురించి ఆలోచించకుండా కేవలం తన సినిమాల గురించి మాత్రమే ఫోకస్ చేసిన ఎన్టీఆర్ మళ్ళీ టీడీపీ కోసం ప్రచారానికి వస్తాడా అనే అంశం మీద పొలిటికల్ చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ విషయం గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఆయన విశ్లేషణ అందించారు.
తెరపైకి ఎన్టీఆర్ పేరు… బాబు మాస్టర్ ప్లాన్ అదే…
ఇటీవల గుంటూరులో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణలో పాల్గొన్న నందమూరి తారక రత్న ఆసక్తికర వాఖ్యలు చేసారు. తమ్ముడు ఎన్టీఆర్ కూడా 2024 ఎన్నికల ప్రచారానికి వస్తాడంటూ చెప్పాడు. ఇక ఈ అంశం గురించి మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఎన్టీఆర్ రాజకీయాల వైపు చూడాలని అనుకోవడం లేదంటూ కామెంట్స్ చేసారు. ఇటీవల జరిగిన పరిణామాలు అందుకు ఎన్టీఆర్ స్పందించిన తీరు చూస్తే ఈ విషయం అర్థవుతుంది అంటూ తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుకు సంబంధించిన అంశం లో కూడా చాలా జాగ్రతగా ఎన్టీఆర్ స్పందించాడు. ఇక తారక రత్న సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా పెద్దగా సక్సెస్ కాలేదు. విలన్ గా మంచి పేరు తెచ్చుకున్నా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నాడు.
తాజాగా రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నట్లు అర్థమవుతుంది. అందుకే ఏపీ లో జరుగుతున్న సంఘటనలపై టీడీపీ మీద వైసీపీ చేస్తున్న దాడులపై ఆవేశంగా స్పందిస్తున్నాడు తారక రత్న. ఇటీవల గుంటూరు విగ్రహావిష్కరణ సందర్బంగా కూడా ఇలానే మాట్లాడారు. ఇక ఎన్టీఆర్ ను కలుపుకునే ప్రయత్నం చేసాడు అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కలిశారు. ఒకవేళ చంద్ర బాబు కలవాలనుకున్నా వెళ్లి ఎన్టీఆర్ కలుస్తాడు కానీ రాజకీయాలకు దూరంగానే ఉంటాడు. ఏదో మ్యాజిక్ జరిగితే తప్ప 2024 ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాడు అంటూ క్లారిటీ ఇచ్చారు భరద్వాజ.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…