Senior Journalist Bhardwaja : ఏపీ ప్రభుత్వం హెల్త్ యూనివర్సిటీ పేరును వైస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా మార్పు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ ఇష్యూ మీద టీడీపీ పార్టీ శ్రేణులు, నందమూరి కుటుంబ సభ్యులు స్పందించారు. మార్చవద్ధంటూ అభిప్రాయపడ్డారు. ఇక ఇలా స్పందించిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ స్పందన మాత్రం టీడీపీ శ్రేణులకే కాదు నందమూరి అభిమానులకు రుచించలేదు. తారక్ ఇలా ఎందుకు మాట్లాడాడు, ఎన్టీఆర్ ను వైస్సార్ తో పోల్చడమేంటి అంటూ అక్షేపించారు. ఇక ఈ విషయం మీద ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ కూడా స్పందించారు. చాలా ఘాటుగా ప్రభుత్వం గురించి, సీనియర్ రాజకీయ నేతల గురించి మాట్లాడారు. ఇక వీటన్నిటికీ కౌంటర్ గా లక్ష్మి పార్వతి తో వైసీపీ మాట్లాడించింది.

ఇన్నేళ్ల ఆమె పగ తీర్చుకుంటోంది.. అపుడు సూట్ కేసులు మోసిన వారిలో మోహన్ బాబు…
లక్ష్మి పార్వతి ప్రెస్ మీట్ పెట్టి తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లందరినీ ఏకి పారేసింది. ఒక జిల్లాకే ఎన్టీఆర్ పేరు పెట్టినపుడు ఇక ఇంత చిన్న విషయాన్ని పట్టించుకోవడం అవసరమా అంటూ జగన్ మనసులో ఎన్టీఆర్ ఉన్నాడు అంటూ మాట్లాడింది. ఇక ఈ విషయాల గురించి విశ్లేషిస్తూ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ మాట్లాడుతూ ఎన్టీఆర్ మరణించినపుడు ఆభరణాలు, డబ్బు అన్నీ దేవినేని నెహ్రు, మోహన్ బాబు సూట్ కేసులు మోసారనే అభియోగం ఉంది.

అందుకనే ఆ తరువాత దేవినేని నెహ్రు ని టీడీపీ లోకి రానివ్వకుండా దూరం పెట్టారనే టాక్ ఉంది. ఇక లక్ష్మి పార్వతికి వడ్డాణం ఇచ్చుంటే నాకు ఎన్టీఆర్ క్యాబినేట్ లో మంత్రి పదవి వచుండేది అంటూ ఎర్రబెల్లి దాయకరావు మాటలను కూడా భరద్వాజ గారు గుర్తు చేస్తూ ఈ మాటలకు కూడా లక్ష్మి పార్వతి కౌంటర్ ఇచ్చింది అంటూ చెప్పారు.





























