Senior Journalist Imandhi Ramarao : నూతన సంవత్సర వేడుకలంటే అందరూ 31 రాత్రి మేల్కొని కొత్త సంవత్సరంకు స్వాగతం పలుకుతారు. అయితే మరి సినిమా తారలు ఎలా సెలెబ్రేట్ చెసుకుంటారో అని చాలా మంది తెలుసుకోవాలని అనుకుంటారు. ఇప్పటి తరాలైతే విదేశాలకు వెళ్లడమే లేక పబ్స్ పార్టీస్ అంటూ ఎంజాయ్ చేస్తారు. మరి అలనాటి తారలు న్యూ ఇయర్ ను ఎలా ఆహ్వానించేవారో సీనియర్ సినిమా జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు పంచుకున్నారు.

రాత్రంతా తాగేవాళ్ళు…
మద్రాస్ లో తెలుగు తరాలందరూ నూతన సంవత్సరం నాడు చాలా ఎంజాయ్ చేసేవారంటూ ఇమంది గారు తెలిపారు. సావిత్రి గారైతే తన చేతికి ఎంత డబ్బు అందితే అంత డబ్బు ఎడమ చేతితో పనివాళ్లకు ఇచ్చేవారట. ఇక ఏడేళ్లు పైబడిన డ్రైవర్ కు ఆ కారును ఇచ్చేసేవారట. యాభై వేలకు పైనే ధర ఉన్న పట్టు చీరను ధరించి అందరికీ కానుకలు ఇచ్చి పంపేవారట సావిత్రి. ఇక రామారావు గారు ప్రతి ఒక్కరికీ బేధం లేకుండా 101 రూపాయలు కవర్లో పెట్టి ఇచ్చేవారట. ఇక దాసరి గారి ఇంట్లో అయితే అయ్యప్ప స్వాముల భజన 12 గంటల వరకు జరిగేదట.

ఆ తరువాత అక్కడే అల్పాహార ఏర్పాటు ఆ తరువాత 101 రూపాయలు ప్రతి ఒక్కరికీ ఇచ్చేవారట. ఇక శోభన్ బాబు గారు జర్నలిస్ట్ లను పిలిచి వారికి తెలియకుండా ఏదైనా పుస్తకంలో ఉంచి ఇచ్చేవారట. ఎవరికి ఎంత ఇచ్చేవరో ఎవరికీ తెలియకుండా ఇచ్చేవారట. ఇక జగ్గయ్య గారి ఇంట్లో మాత్రం వేడుకలు బాగా జరిగేవట. ఆయన పుట్టినరోజు, నూతన సంవత్సరం ఒకే రోజు కావడంతో అన్నా నగర్ ఆయన ఇంటి టెర్రస్ మీద మంచి విందు ఏర్పాటు చేస్తే ఆత్రేయ వంటి ఎంతో మంది వచ్చి ఎంజాయ్ చేస్తూ న్యూ ఇయర్ కి వెల్కమ్ పలికేవారట. రాత్రంతా అక్కడే తాగి ఎంజాయ్ చేసేవారంటూ ఇమంది రామారావు గారు చెప్పారు.



































