Senior Journalist Imandhi Ramarao : చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళంలో సినిమాల్లోకి అడుగుపెట్టిన అలనాటి నటి రాజశ్రీ గారు. తెలుగు వారికైతే ఎక్కువగా రాజకుమారిగా నటించిన రాజశ్రీ స్వస్థలం ఏలూరు దగ్గర ఊరు. జానపద సినిమాల్లో రాజకుమారిగా ఎక్కువగా నటించిన రాజశ్రీ ఎన్నో సినిమాల్లో అగ్ర హీరోలందరి సరసనా నటించింది. అలానే అన్ని సౌత్ భాషల్లోనూ నటించిన రాజశ్రీ గారి మీద అప్పట్లో కొన్ని పుకార్లు బాగా ప్రచారంలో ఉన్నాయి. ఇక ఆమె జీవితం గురించి సీనియర్ సినిమా జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడారు.

సావిత్రి, జెమిని గణేశన్ విడిపోడానికి కారణం…
ఇమంది గారు మాట్లాడుతూ రాజశ్రీ గారు అప్పట్లో బిజీ ఆర్టిస్ట్ గా ఉండేవారు, బాగా ఆస్తులను సంపాదించారు అంటూ చెప్పారు. ఇక అన్ని భాషల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్న సమయంలో ఎంఎల్సి పాంచజన్యం ను పెళ్లిచేసుకున్నారు. పెళ్లయ్యాక ఒక ఐదేళ్ళకే ఆయన మరణించడం మళ్ళీ మద్రాస్ వచ్చి సినిమాల్లో బిజీ అయ్యారు రాజశ్రీ. అయితే ఆస్తులను బాగానే సంపాదించారు. కానీ అప్పట్లో సావిత్రి గారి ఆస్తులను రాజశ్రీ గారు తీసుకున్నారు.

సావిత్రి, జెమిని గణేశన్ మధ్య గొడవలు రావడానికి ఆవిడే కారణం అనే ప్రచారం జరిగేది కానీ అవన్నీ నిజాలు కావు, రాజశ్రీ గారు ఎంతో అస్థి సంపాదించారు ఇంకొకరి అస్థి అవసరం లేదు. సావిత్రి గారు భర్తతో విడిపోడానికి, గొడవ పడటానికి కారణాలు వేరే ఉన్నాయి. సావిత్రి గారు జెమినీ గణేశన్ మీద ఎంత విరక్తి చెందక పోతే ఆయన ఒకసారి ఇంటివద్దకు వస్తే కుక్కలను వదిలారు ఆయన మీదకు, అసలు వాళ్లిద్దరి గొడవకు ఈమె కారణం కాదు అంటూ ఇమంది గారు విశ్లేషించారు.
































