Senior Producer Chittibabu : నందమూరి తారకరత్న విషయంలో ఎవరూ ఊహించని విషాదం ఆయన కుటుంబాన్ని కమ్మేసింది. నలభై ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో మరణించి ఆయన కుటుంబాన్ని శోక సంద్రంలో నెట్టారు. తారకరత్న గారు సినిమాల్లో అంతగా రానించకపోయినా మంచి వాగ్దాటి ఉండటంతో టీడీపీ లో ఈసారి ఎమ్మెల్యే కి పోటీచేయాలని భావించారు. అయితే ఆయన ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు ఆయన అందరికీ శాశ్వతంగా దూరమయ్యరు. ఆయన వ్యక్తగత జీవితంలోనూ ఇప్పుడిప్పుడే తన ప్రేమ వివాహం వల్ల దూరమైన కుటుంబం మళ్ళీ కలుసుకుంటారు అనుకునే సమయానికి ఆయనే శాశ్వతంగా దూరం అయ్యాడు. ఆయన గురించిన చిన్న అంశం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక తారకరత్న గారి అంత్యక్రియలు మరియు ఇతర కార్యక్రమాలకి నందమూరి కుటుంబం మొత్తం హాజరవగా అందులో జూనియర్ ఎన్టీఆర్ ను బాలకృష్ణ పట్టించుకోలేదనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయాల మీద సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు క్లారిటీ ఇచ్చారు.
జూనియర్ ను పలకరించని బాలయ్య…
చిట్టిబాబు గారు మాట్లాడుతూ ఇంతకు ముందు చూసినట్లుగానే ఇప్పుడు జనం నందమూరి కుటుంబాన్ని చూస్తున్నారు. నిజానికి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తో బాగా ఉన్నారు. తారకరత్న కార్యక్రమాలలో తనని పలకరించలేదు అనేది అవాస్తవం. కానీ నందమూరి కుటుంబంలో ముందు నుండి పెద్దాయన నేర్పిన సంస్కృతి ఒకటే ఎంత ఆప్యాయంగా వాళ్ళు ఉన్నా అది అందరి ముందు హగ్ చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం లాంటివి ఉండవు. అలాగే అన్నగారి దగ్గరికి కూడా పిల్లలు వెళ్లి చనువుగా ఉండటం బయట ఎక్కడైనా చూసారా, మిగిలిన కుటుంబాల్లో ఉన్నట్లు నందమూరి కుటుంబంలో ఉండదు.
ఒకరికి ఒకరు గౌరవంగా ఉంటారు. నందమూరి కుటుంబంలో ఈ విషయం తెలిసిన వాళ్లెవరూ ఆ కుటుంబంలో విబేధాలు ఉన్నాయని భావించరు. ఇంతకు ముందు హరికృష్ణ గారు పెద్దగా వ్యవహరించారు. ఇప్పుడు బాలకృష్ణ అయన తరువాత కుటుంబ పెద్దగా బాధ్యత తీసుకున్నారు. అలాంటప్పుడు అందరినీ కలుపుకు పోతాడు కానీ దూరం పెట్టడు అంటూ అభిప్రాయపడ్డారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…