Senior Producer Chittibabu : నందమూరి తారకరత్న విషయంలో ఎవరూ ఊహించని విషాదం ఆయన కుటుంబాన్ని కమ్మేసింది. నలభై ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో మరణించి ఆయన కుటుంబాన్ని శోక సంద్రంలో నెట్టారు. తారకరత్న గారు సినిమాల్లో అంతగా రానించకపోయినా మంచి వాగ్దాటి ఉండటంతో టీడీపీ లో ఈసారి ఎమ్మెల్యే కి పోటీచేయాలని భావించారు. అయితే ఆయన ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు ఆయన అందరికీ శాశ్వతంగా దూరమయ్యరు. ఆయన వ్యక్తగత జీవితంలోనూ ఇప్పుడిప్పుడే తన ప్రేమ వివాహం వల్ల దూరమైన కుటుంబం మళ్ళీ కలుసుకుంటారు అనుకునే సమయానికి ఆయనే శాశ్వతంగా దూరం అయ్యాడు. ఆయన గురించిన చిన్న అంశం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక తారకరత్న గారి అంత్యక్రియలు మరియు ఇతర కార్యక్రమాలకి నందమూరి కుటుంబం మొత్తం హాజరవగా అందులో జూనియర్ ఎన్టీఆర్ ను బాలకృష్ణ పట్టించుకోలేదనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయాల మీద సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు క్లారిటీ ఇచ్చారు.
జూనియర్ ను పలకరించని బాలయ్య…
చిట్టిబాబు గారు మాట్లాడుతూ ఇంతకు ముందు చూసినట్లుగానే ఇప్పుడు జనం నందమూరి కుటుంబాన్ని చూస్తున్నారు. నిజానికి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తో బాగా ఉన్నారు. తారకరత్న కార్యక్రమాలలో తనని పలకరించలేదు అనేది అవాస్తవం. కానీ నందమూరి కుటుంబంలో ముందు నుండి పెద్దాయన నేర్పిన సంస్కృతి ఒకటే ఎంత ఆప్యాయంగా వాళ్ళు ఉన్నా అది అందరి ముందు హగ్ చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం లాంటివి ఉండవు. అలాగే అన్నగారి దగ్గరికి కూడా పిల్లలు వెళ్లి చనువుగా ఉండటం బయట ఎక్కడైనా చూసారా, మిగిలిన కుటుంబాల్లో ఉన్నట్లు నందమూరి కుటుంబంలో ఉండదు.
ఒకరికి ఒకరు గౌరవంగా ఉంటారు. నందమూరి కుటుంబంలో ఈ విషయం తెలిసిన వాళ్లెవరూ ఆ కుటుంబంలో విబేధాలు ఉన్నాయని భావించరు. ఇంతకు ముందు హరికృష్ణ గారు పెద్దగా వ్యవహరించారు. ఇప్పుడు బాలకృష్ణ అయన తరువాత కుటుంబ పెద్దగా బాధ్యత తీసుకున్నారు. అలాంటప్పుడు అందరినీ కలుపుకు పోతాడు కానీ దూరం పెట్టడు అంటూ అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…