తెలంగాణలోని మలక్పేటలో సీపీఐ నేత చందు రాథోడ్ అలియాస్ చందు నాయక్ (50) హత్య కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ఇటీవల శాలివాహననగర్ పార్కులో వాకింగ్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగివెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కళ్లలో కారం చల్లి, అతి దగ్గర నుంచి ఎనిమిది రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ దారుణ హత్యతో స్థానికంగా తీవ్ర సంచలనం రేగింది.

తాజాగా పోలీసులు ఈ కేసులో మొత్తం 9 మందిని గుర్తించి, అందులో నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో నలుగురు నేరుగా కాల్పులు జరిపినట్టు దర్యాప్తులో వెల్లడించగా, మిగతా ఐదుగురు వారికి సహాయపడ్డట్టు తెలిసింది. చందు శరీరంలో ఐదు బుల్లెట్లు బయటపడ్డాయి, మరో మూడు బుల్లెట్లు సంఘటనా స్థలంలో స్వాధీనం చేశారు. మిగిలిన మూడు నిందితుల కోసం పోలీసులు పది ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.
ప్రాధమిక దర్యాప్తులో వివాహేతర సంబంధం కోణంలో ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందులో భూ వివాదాలే ప్రధాన కారణంగా కూడా భావిస్తున్నారు. గతంలో చందు నాయక్ వివిధ భూ వివాదాల్లో పాలుపంచుకున్నట్టు సమాచారం. అదే అంశం ఈ హత్యకు దారితీసి ఉండవచ్చని పోలీసుల అంచనా.
ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలుగు చూడనుండగా, ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. స్థానికంగా ఈ హత్యcase తీవ్ర చర్చనీయాంశంగా మారింది.



























