Serial Actress Jyothi Reddy : దాదాపు ముప్పై ఏళ్లుగా బుల్లితెర మీద సీరియల్స్ లో కనిపిస్తూ అటు నెగెటివ్ పాత్రలను ఇటు పాజిటివ్ పాత్రలను చేస్తూ అలరిస్తున్న నటి జ్యోతి రెడ్డి. ప్రస్తుతం పలు సీరియల్స్ లో బిజీగా ఉన్న జ్యోతి రెడ్డి తాజాగా యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొని ఆమె వ్యక్తిగత కుటుంబ విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ప్రేమ ఎంత మధురం సీరియల్ లో అతిధిగా నటిస్తున్న ఆమె తాజాగా జెమినీ ఛానెల్ లో రాబోతున్న ఒక పాన్ ఇండియా సీరియల్ లో నటిస్తున్నారు.

సీరియల్లో వచ్చే డబ్బులు బట్టలకే అయిపోతాయి…
ఇప్పటికీ ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ ఉన్న జ్యోతిరెడ్డి గారు తన సీరియల్ అనుభవాలను పంచుకున్నారు. సీరియల్స్ లో నటించేటపుడు అపుడు వాడే నగలు, బట్టలు అన్ని తామే తెచ్చుకుంటాము అంటూ చెప్పారు. సంపాదించే దాంట్లో సగం నగలు బట్టలకే అయిపోతుందని చెప్పారు జ్యోతిరెడ్డి గారు.

క్యాస్టమ్స్ వేసినవే మళ్ళీ వేసినా ఛానెల్ వాళ్ళ ఒప్పుకోరు, ప్రతిసారి కొత్తగా ఉండాల్సిందే అని జ్యోతిరెడ్డి గారు చెబుతారు. మాకు లోన్స్ కూడా రావు కానీ మేము టాక్స్ మాత్రం ఖచ్చితంగా కడతాము అంటూ చెప్పారు జ్యోతి రెడ్డి. ఈ నెల పని ఉంటే నెక్స్ట్ నెల పని ఉండకపోవచ్చు అందుకే మాకు లోన్స్ ఇవ్వడానికి ఆలోచిస్తారు అంటూ చెప్తారు జ్యోతి రెడ్డి.
































