Shoban Babu : ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలు, ప్రేమ కథా చిత్రలతో అభిమానులకు దగ్గర అయ్యాడు శోభన్ బాబు. అప్పట్లో ఆంధ్రుల అందాల నటుడుగా పేరు సంపాదించుకున్నాడు. 1959లో వచ్చిన దైవబలం సినిమాలో చిన్న పాత్ర ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. 1965 లో వచ్చిన వీరాభిమన్యు సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. ఇక అప్పటినుండి కెరీర్ లో వెనుదిరిగి చూసుకోలేదు శోభన్ బాబు. ఆయన 200 కు పైగా సినిమాలలో వివిధ పాత్రాలలో నటించి అలరించాడు. అయితే అప్పట్లో శోభన్ బాబు, జయలలితల గురించి చాలా వార్తలు వచ్చేవి. సీనియర్ జర్నలిస్ట్ అయిన ఇమంది రామారావు గారు వీటిగురించి చాలా ఆసక్తికర విషయాలు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఇప్పుడు వాళ్లకు పుట్టిన కూతురు ఎక్కడ ఉందంటే…..
దాదాపు 50 సంవత్సరాలు జర్నలిస్ట్ గా పనిచేసిన ఇమంది రామారావు గారు శోభన్ బాబు జయలలిత ల గురించి చాలా ఆసక్తికర విషయాలు చెప్పారు. అప్పట్లో మన హీరోలతో మంచి తనకు మంచి సంబంధాలు ఉండేవాని, శోభన్ బాబు గారు కూడా నాకు బాగా తెలుసనీ చెప్పుకొచ్చారు. శోభన్ బాబు గారికి అప్పట్లో జయలలిత గారితో కలసి నటించడం అంటే చాలా ఇష్టమని ఆమెను ఆరాధించే వాడని చెప్పుకొచ్చారు. ఒకరోజు శోభన్ బాబు గారితో కలసి జయలలిత ఇంటికి వెళ్లానని, వాళ్ళ ఇల్లు ఒక ఇంద్రభవనం లాగా వుండేదాని, రకరకాల వంటలతో డైనింగ్ టేబుల్ నిండి పోయిందని చెప్పుకొచ్చారు. ఎవరికీ వారు వడ్డించుకున్నామని, కానీ శోభన్ బాబు గారికి మాత్రం ఆవిడే స్వయంగా వడ్డీంచారు అని ఆయన అంటే అమితమైన ప్రేమ చూపించేవారనీ చెప్పారు.

ఆయనను ఒకరోజు చూడకపోయినా ఆవిడా ఉండేవారు కారని అంతలా వారి బంధం వుండేదని చెప్పుకొచ్చారు. ఇక వారి బిడ్డ గురించి ప్రస్తావన తెస్తే…. అది నిజం అని వారికి ఒక పాప ఉందని ప్రస్తుతం ఆ అమ్మాయి లండన్ లో ఉందనుకుంటా అని చెప్పారు. అందరు వారికీ అబ్బాయి ఉన్నాడేమో అనుకునేవారు. జయలలిత ఒక అబ్బాయికి పెళ్లి చేయడంతో తానే వాళ్ళ అబ్బాయి అందుకే వివాహం ఇంత ఘనంగా జరిపించారు అనుకున్నారు. కానీ వారికి వున్నది అమ్మాయి అని చెప్పుకొచ్చారు.






























