Health Tips: పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలా? గర్భిణీలు ఈ ఆహార పదార్థాలు తప్పక తీసుకోవాలి..!
Health Tips: మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. సరైన పద్ధతిలో పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఆహారం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో తల్లి తీసుకునే ఆహారం మీద బిడ్డ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.
పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో తెలుసుకుందాం…ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు సమయానుకూలంగా పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ, ఒత్తిడి లేకుండా ఉండటం చాలా ముఖ్యం.
పోషకాలు ఎక్కువగా ఉండే పండ్లు,కూరగాయలు ,పప్పు దినుసులు, డ్రై ఫ్రూట్స్, మాంసం వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా జీడిపప్పు,బాదం పప్పు ,వేరుశెనగలు, పిస్తా పప్పు ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఆరోగ్యానికి అవసరమైన అనేక రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
ప్రెగ్నెంట్ గా ఉన్న మహిళలు రోజువారి ఆహారంలో బీట్ రూట్ తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే రక్తహీనత సమస్యను బీట్రూట్ నియంత్రిస్తుంది. శరీరంలో రక్తం శాతం సమృద్ధిగా ఉండాలంటే దానిమ్మ పండ్లు ఎక్కువగా తినాలి. బీట్ రూట్ , ఎండు ఖర్జూరం లో శరీరానికి అవసరమైన ఐరన్ , ఫోలెట్ ఎక్కువగా ఉంటాయి.ప్రెగ్నెన్సీ సమయంలో మాంసం తినటం చాలా అవసరం. ముఖ్యంగా ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళలు చాపలు తినడం ఎంతో అవసరం. కానీ సముద్రంలో లభించే చేపలను తినటం కన్నా మంచి నీటి చెరువులో లభించే వాటిని తినటం శ్రేయస్కరం. సముద్రపు చేపల లో పాదరసం ఎక్కువగా ఉంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…