Shruthi Hassan: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇక తాజాగా ఈమె చిరంజీవి బాలకృష్ణ సరసన నటించిన వీర సింహారెడ్డి వాల్తేరు వీరయ్య సినిమాలు కూడా విడుదలై ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నాయి. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
సోషల్ మీడియా వేదికగా తన సినిమా విషయాలను వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే ఈమె గత కొద్దిరోజులుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నానని తన వ్యాధి గురించి బయటపెట్టారు. ఇలా శృతిహాసన్ మానసిక సమస్యలతో బాధపడుతూ చికిత్స కూడా తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.
నేను బాధపడుతున్న ఈ సమస్య కారణంగా కొన్నిసార్లు ఎక్కువగా ఆవేశ పడిపోతానని అలాగే సహనం కూడా కోల్పోతున్నానని తెలిపారు.అయితే నాకున్న ఈ సమస్యను బయట పెట్టడానికి మొదట్లో భయపడ్డాను. అయితే ఇలాంటి సమస్యలను దాచిపెట్టడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుందన్న ఉద్దేశంతోనే నా సమస్యను అందరితో పంచుకున్నానని శృతిహాసన్ తెలిపారు.
ఇంట్లో అయిన షూటింగ్ లొకేషన్లో అయినా తాను అనుకున్నది జరగకపోతే తనకు చాలా కోపం వస్తుందని,ఈ పరిస్థితి తీవ్రతరం కాకుండా వెంటనే తెరపి కూడా తీసుకుంటున్నానని తెలిపారు. అలాగే ఈ సమస్య నుంచి బయటపడటానికి తాను సంగీతం కూడా వింటున్నానని ఈమె తన వ్యాధి గురించి తెలియజేస్తూ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…