Shruthi Hassan: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇక తాజాగా ఈమె చిరంజీవి బాలకృష్ణ సరసన నటించిన వీర సింహారెడ్డి వాల్తేరు వీరయ్య సినిమాలు కూడా విడుదలై ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నాయి. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

సోషల్ మీడియా వేదికగా తన సినిమా విషయాలను వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే ఈమె గత కొద్దిరోజులుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నానని తన వ్యాధి గురించి బయటపెట్టారు. ఇలా శృతిహాసన్ మానసిక సమస్యలతో బాధపడుతూ చికిత్స కూడా తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.
నేను బాధపడుతున్న ఈ సమస్య కారణంగా కొన్నిసార్లు ఎక్కువగా ఆవేశ పడిపోతానని అలాగే సహనం కూడా కోల్పోతున్నానని తెలిపారు.అయితే నాకున్న ఈ సమస్యను బయట పెట్టడానికి మొదట్లో భయపడ్డాను. అయితే ఇలాంటి సమస్యలను దాచిపెట్టడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుందన్న ఉద్దేశంతోనే నా సమస్యను అందరితో పంచుకున్నానని శృతిహాసన్ తెలిపారు.

Shruthi Hassan: ప్రశాంతత కోసం సంగీతం వింటాను…
ఇంట్లో అయిన షూటింగ్ లొకేషన్లో అయినా తాను అనుకున్నది జరగకపోతే తనకు చాలా కోపం వస్తుందని,ఈ పరిస్థితి తీవ్రతరం కాకుండా వెంటనే తెరపి కూడా తీసుకుంటున్నానని తెలిపారు. అలాగే ఈ సమస్య నుంచి బయటపడటానికి తాను సంగీతం కూడా వింటున్నానని ఈమె తన వ్యాధి గురించి తెలియజేస్తూ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.



























